Congress: త్వరలో తెలంగాణకు రాహుల్ గాంధీ.. సూర్యాపేటలో సభ..?
- కేసీ వేణుగోపాల్ నివాసంలో ముగిసిన టీకాంగ్రెస్ నేతల సమావేశం
- పాల్గొన్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
- ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా,
- జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ
- తెలంగాణ ప్రభుత్వ పనితీరు, ఎన్నికల హామీల అమలుపై సమీక్ష
- మంత్రులతో ముఖాముఖి భేటీలు నిర్వహించిన కేసీ వేణు గోపాల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో టీ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారుపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు చర్చించారు. ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై చర్చించారు. సంస్థాగత అంశాలతో పాటు, శాఖల వారీగా పనితీరుపై సమీక్ష చేపట్టారు. కేసీ వేణు గోపాల్ మంత్రులతో ముఖాముఖి భేటీలు నిర్వహించారు.
Read Also: TTD Tickets: తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం.. పోలీసుల అదుపులో ముగ్గురు!
Also Read
- Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
- Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సూర్యాపేట లేదా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. “సంవిధాన్ బచావో” (రాజ్యాంగం పరిరక్షణ) ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఈ నెలాఖరు కల్లా నామినేటేడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా.. పీసీసీ కార్యవర్గం ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే నిజమైన కార్యకర్తలకే జిల్లా కాంగ్రెస్ కమిటీ” (డీసీసీ) అధ్యక్ష పదవులివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షులు ప్రతిపాదించి, సిఫార్సు చేసే వారికే ప్రాధాన్యతనిచ్చి, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనుంది అధిష్ఠానం. వచ్చే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దిశగా సమిష్టిగా సన్నద్దం కావాలని నిర్దేశం చేశారన్నారు. మంత్రివర్గ విస్తరణ, మార్పులు, చేర్పులు పై అధిష్ఠానం, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
Read Also: Manchu Manoj: బయటినుంచి రౌడీలను తీసుకొచ్చారు..వాళ్లకు నేను ఒక్కడిని చాలు!
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!