Rahul Gandhi: ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో సూట్ కేసులు మోసిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఇక్కడి రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న కూలీలను ఆయన కలిశారు. వారితో మాట్లాడి పనిలో పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దాని పరిష్కారంపై వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు. గత నెలలో కాంగ్రెస్ నాయకుడిని కలవాలని కూలీలు తమ కోరికను వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన తర్వాత, రాహుల్ వారిని కలవాలని ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు. రైల్వే స్టేషన్లో కాంగ్రెస్ నేతలు కూడా లగేజీలు ఎత్తుకోవడం కనిపించింది. రైల్వే స్టేషన్లో ఎర్రటి పోర్టర్ యూనిఫాంలో రాహుల్ కనిపించాడు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిసే సమయంలో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ఇక్కడ ఆటో డ్రైవర్లు, కూలీలను కలవడం చాలా సంతోషంగా ఉంది. మా సమస్యలను ప్రభుత్వం ముందు నివేదిస్తానని చెప్పారు. మా అభిప్రాయాలను ప్రభుత్వం ముందు ఉంచుతానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారని ఆ వ్యక్తి చెప్పాడు.
Also Read
- Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
Read Also:Khalistani Terrorist: కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడి హత్య.. భారత్లో పలు క్రిమినల్ కేసులు!
VIDEO | Congress leader Rahul Gandhi meets railway porters at Anand Vihar Railway Station in Delhi, wears porter dress and badge. pic.twitter.com/wYqOGOmB2v
— Press Trust of India (@PTI_News) September 21, 2023
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ యాత్రలో భాగంగా ఆయన ఈరోజు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. గత నెలలో కూలీలు రాహుల్ గాంధీని కలుసుకుని తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటున్నట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
Read Also:Chandrayaan-3 : ‘చంద్రయాన్’ కోసం పనిచేసిన వాళ్లు జీతం లేక ఉదయం టీ అమ్ముకుంటున్నారు : జేఎంఎం ఎంపీ
EXCLUSIVE:
Rahul Gandhi lifts the luggage in the dress of a coolie at Anand Vihar station.
Last month, these coolies demanded to meet Rahul Gandhi.
In just 36 days, their wish came true just with a viral video.
Rahul Gandhi is hitting BJP on their propaganda machinery by… pic.twitter.com/8LnbQ6uIMU
— Amock (@Politics_2022_) September 21, 2023
గతంలో కూడా కూలీలతో కాంగ్రెస్ నేత సమావేశమయ్యారు. గతేడాది ఉదయ్పూర్లోని కాంగ్రెస్ చింతన్ శివిర్కు వెళ్లి కూలీ సంఘం సభ్యులను కలిశారు. ప్రతిరోజు ఆయన సామాన్య ప్రజలను కలుసుకోవడం కనిపిస్తుంది. ఇటీవల ఆయన తన ఇంటికి కూరగాయలు అమ్మే వ్యక్తిని, అతని భార్యను ఆహ్వానించాడు. వారితో కలిసి భోజనం చేసి మాట్లాడారు.
తాజావార్తలు
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!