Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక నిర్ణయాలు
- యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు భారం వినియోగదారులపైనే పడుతుందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. యూపీఐ లావాదేవీలపై ఫీజులు వసూలు చేయడానికి ప్రభుత్వం రహస్యంగా మార్గం సుగమం చేసిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రూ. 2,000 దాటిన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించడానికి మోడీ ప్రభుత్వం అనుమతించిందన్నారు. రూ. 2,000 పైబడిన లావాదేవీల సంఖ్య కేవలం 5 శాతమే అయినప్పటికీ.. మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో సుమారు 65 శాతం ఈ లావాదేవీల నుంచే వస్తుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా యూపీఐ ద్వారా రూ.2,000 వరకు చేసే లావాదేవీలపై.. అలాగే రూపే డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్రం ఆదేశించింది. అయితే రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై మాత్రం ఛార్జీలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది.
Also Read
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- UPI Charges: రూ.2,000 వరకు UPI పేమెంట్స్ ఫ్రీ.. RuPay డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లకూ ఛార్జీలు లేవు
- Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
‘‘మోడీ ప్రభుత్వం యూపీఐపై ఫీజులు విధించేందుకు నిశ్శబ్దంగా తలుపులు తెరిచింది. ఇప్పుడు రూ.2,000కు మించిన వ్యాపారి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (Merchant Discount Rate) విధించవచ్చు. ఇలాంటి లావాదేవీలు పరిమాణం పరంగా కేవలం 5 శాతం ఉన్నప్పటికీ.. యూపీఐ మొత్తం లావాదేవీల విలువలో దాదాపు 65 శాతం వాటా కలిగి ఉన్నాయి’’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అయితే రూ.2,000కు మించిన లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తారా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించలేదు. ఇప్పటివరకు లావాదేవీ మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు లేవు.
‘భారం వినియోగదారులపైనే’
యూపీఐ వినియోగదారులపై నేరుగా ఎలాంటి ఫీజులు ఉండవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వ్యాపారులపై విధించే ఛార్జీల భారం చివరికి వినియోగదారులపైనే పడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘వినియోగదారుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. కానీ దుకాణదారులపై విధించే ఫీజులు చివరికి ఎక్కడి నుంచి వస్తాయి? ధరలు పెంచి.. నేరుగా వినియోగదారుల జేబు నుంచే వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. అమెరికాకు చెందిన పేమెంట్ కంపెనీలు చాలా కాలంగా భారత్లో అమలవుతున్న జీరో-ఎండీఆర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చే దిశగా మార్గం సుగమం చేసిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?