Rahul Gandhi: తెలంగాణతో కుటుంబ సంబంధం ఉంది.. అందుకే నా చెల్లెల్ని తీసుకువచ్చా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తెలంగాణతో మాకు కుటుంబ సంబంధం ఉందని, రాజకీయ సంబంధం కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారంలో ఇవాళ ఉదయం జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ ఈ ఉదయం భూపాలపల్లి నుంచి బస్సులో కాటారం చేరుకున్నారు. కాంగ్రెస్ బస్సు యాత్ర రెండో రోజు ఉదయం ప్రారంభమైంది. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణతో మోడీ, కేసీఆర్లకు కేవలం రాజకీయ సంబంధమే ఉంది.. మీరంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి.. మీకు మాకు మధ్య ఉంది రాజకీయ సంబంధం కాదు.. మీ అభిమానం.. ఆశీర్వాదంతో కూడిన సంబంధం.. అందుకే మా చెల్లెను తీసుకు వచ్చా.. ప్రియాంకకి చెప్పా తెలంగాణతో మనకు రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం అని చెప్పి తీసుకు వచ్చా రాహుల్ గాంధీ సెంటి మెంట్ డైలాగ్స్ చెప్పారు. దొరల తెలంగాణకి.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం.. దొర ఇలాకాలో మనకీ మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుందన్నారు.
కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను లూటీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో మహిళలందరూ ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.. నేను అబద్ధం చెప్పను.. పనికి మాలిన మాటలు చెప్పనని అన్నారు. కేసీఆర్లా 3 ఎకరాల భూమి ఇస్తాం లాంటి హామీలు ఇవ్వడానికి రాలేదన్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు ప్రయాణమని హామీ ఇచ్చారు. దేశ సంపదలో పేదలకు వాటా ఇస్తామన్నారు. దేశంలో 5 శాతం ఓబీసీ అధికారులు ఉంటే ఆ వర్గాలకు ఎలా న్యాయం జరుగుతుందన్నారు. కులాల వారీగా జన గణన చేస్తామన్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కుల జన గణన చేయండి అని అదేశించామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులాల వారీగా జన గణన చేస్తామన్నారు. దేశంలో బడా వ్యాపారులకు అప్పులు మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు..? రైతులు రుణం చెల్లించకపోతే బయటకు గెంటి వేస్తున్నారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ చేయడం లేదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఎందుకు దృష్టి సారించలేదన్నారు. కేసీఆర్ తన అవినీతిని పక్క రాష్ట్రాలకు కూడా విస్తరింపజేశారని ఆరోపించారు.తెలంగాణలో దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ అవినీతి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ పై చర్యలు తీసుకోలేదన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం తనపై ఇరవైకి పైగా కేసులు నమోదు చేసిందని గుర్తు చేశారు. మీ ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో కేసీఆర్ ఓటమి ఖాయం.
MLC Kavitha: ప్రియాంక గాంధీ పై కవిత సెటైర్.. మీరేనా ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి మాట్లాడేది..!
తాజావార్తలు
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
-
Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్
-
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
-
Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!