Rahul Gandhi: తెలంగాణతో కుటుంబ సంబంధం ఉంది.. అందుకే నా చెల్లెల్ని తీసుకువచ్చా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తెలంగాణతో మాకు కుటుంబ సంబంధం ఉందని, రాజకీయ సంబంధం కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారంలో ఇవాళ ఉదయం జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ ఈ ఉదయం భూపాలపల్లి నుంచి బస్సులో కాటారం చేరుకున్నారు. కాంగ్రెస్ బస్సు యాత్ర రెండో రోజు ఉదయం ప్రారంభమైంది. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణతో మోడీ, కేసీఆర్లకు కేవలం రాజకీయ సంబంధమే ఉంది.. మీరంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి.. మీకు మాకు మధ్య ఉంది రాజకీయ సంబంధం కాదు.. మీ అభిమానం.. ఆశీర్వాదంతో కూడిన సంబంధం.. అందుకే మా చెల్లెను తీసుకు వచ్చా.. ప్రియాంకకి చెప్పా తెలంగాణతో మనకు రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం అని చెప్పి తీసుకు వచ్చా రాహుల్ గాంధీ సెంటి మెంట్ డైలాగ్స్ చెప్పారు. దొరల తెలంగాణకి.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం.. దొర ఇలాకాలో మనకీ మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుందన్నారు.
కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను లూటీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో మహిళలందరూ ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.. నేను అబద్ధం చెప్పను.. పనికి మాలిన మాటలు చెప్పనని అన్నారు. కేసీఆర్లా 3 ఎకరాల భూమి ఇస్తాం లాంటి హామీలు ఇవ్వడానికి రాలేదన్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు ప్రయాణమని హామీ ఇచ్చారు. దేశ సంపదలో పేదలకు వాటా ఇస్తామన్నారు. దేశంలో 5 శాతం ఓబీసీ అధికారులు ఉంటే ఆ వర్గాలకు ఎలా న్యాయం జరుగుతుందన్నారు. కులాల వారీగా జన గణన చేస్తామన్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కుల జన గణన చేయండి అని అదేశించామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులాల వారీగా జన గణన చేస్తామన్నారు. దేశంలో బడా వ్యాపారులకు అప్పులు మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు..? రైతులు రుణం చెల్లించకపోతే బయటకు గెంటి వేస్తున్నారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ చేయడం లేదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఎందుకు దృష్టి సారించలేదన్నారు. కేసీఆర్ తన అవినీతిని పక్క రాష్ట్రాలకు కూడా విస్తరింపజేశారని ఆరోపించారు.తెలంగాణలో దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ అవినీతి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ పై చర్యలు తీసుకోలేదన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం తనపై ఇరవైకి పైగా కేసులు నమోదు చేసిందని గుర్తు చేశారు. మీ ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో కేసీఆర్ ఓటమి ఖాయం.
MLC Kavitha: ప్రియాంక గాంధీ పై కవిత సెటైర్.. మీరేనా ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి మాట్లాడేది..!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!