Rahul Gandhi : రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నర్సాపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో కాంగ్రస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం రాకముందు అత్తాడుగువర్గాల వారికీ ఎటువంటి హక్కులు లేవని, రాజ్యాంగం వచ్చాకే మనకు హక్కులు వచ్చాయన్నారు. ఈ రాజ్యాంగం మన కోసం మనం రాసుకోవడానికి అనేకమంది తమ రక్తాన్ని ధారాబోశారని, బీజేపీ అగ్ర నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగా చెబుతున్నారన్నారు రాహుల్ గాంధీ. మోడీ, ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగాన్ని మార్చాలని అంటుందని, రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మాదని ఆయన వ్యాఖ్యానించారు. మనకి ఓటు వేసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, మోడీ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయివేటు పరం చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లు తీసేయడానికే మోడీ ఇలా కుట్ర చేస్తున్నారని, రిజర్వేషన్లు తీసేయాలని బిజెపి అంటుంది…మేము 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు రాహుల్ గాంధీ.
అంతేకాకుండా..’తెలంగాణలో కులగణన జరిగినట్టే..దేశమంతా కూడా కులగణన చేస్తాం. దేశంలో ఏ సామాజిక వర్గం వారు ఎంతమంది ఉన్నారో వారికి తెలియాలి. ఇలా జరిగినప్పుడే నిజమైన రాజకీయ చైతన్యం ప్రారంభం అవుతుంది. కేవలం 2 శాతం ఉన్నవారి చేతిలోనే దేశ సంపద మొత్తం ఉంది. మోడీ ఎయిర్ పోర్టులు, పెద్ద పెద్ద సంస్థలు అదాని కి అప్పగిస్తున్నారు. దేశ సంపద మొత్తం 20, 25 మంది చేతుల్లోనే ఉంది. ఆ సంపద కోట్ల మందికి రావాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచంలో ఎలాంటి ప్రభుత్వం ఇటువంటి పనులు చేయకపోవచ్చు. దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబ స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నాము. ఎంపిక చేసిన పేదలకు ఒక లక్ష రూపాయలు అకౌంట్ లో వేస్తాము. ప్రతి మహిళ అకౌంట్ లో 8500 ప్రతి నెల తప్పకుండా వేస్తాము. ఒక్క దెబ్బతో దేశంలో, తెలంగాణలో పేదరికాన్ని నిర్ములిస్తాం. మోడీ కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు.
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
పెద్ద నోట్ల రద్దు మోడీ అదాని ప్రయోజనాల కోసమే చేశారు. ఇండియా కూటమి జూన్ 7న ఏర్పడబోతుంది. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న మోడీ ఇవ్వలేకపోయారు. ఆగస్ట్ 15నాడు మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రైతులను ప్రధాని అనేక రకాలుగా వేదించారు. కొట్లాదిపతుల రుణాలను మాఫీ చేశారు కానీ…రైతుల రుణమాఫీ చేయలేదు. మేము రాగానే రైతుల సమస్యలు తీరుస్తాం. ధాన్యానికి మద్దతు ధర కచ్చితంగా ఇస్తాము. ఉపాధిహామీ కూలిని 400 రూపాయలకు పెంచుతాం. మోడీ అదాని, అంబానీలకు సొమ్ము ఇచ్చారో.. మేము అంత సొమ్మును పేదల అకౌంట్ లో వేస్తాము. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కోసమే పని చేస్తూంది. 30 వేల ఉద్యోగాలు, 500 కె సిలిండర్, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నాం. ఆగస్ట్ 15నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. మీ కోసం ఢిల్లీలో సైనికుడిలా పని చేస్తాను’ అని రాహుల్ గాంధీ అన్నారు.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!