Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghav Chadha: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ప్రస్తావించే ప్రతి అంశం సగటు భారతీయుడు ఆలోచనలకూ చాలా దెగ్గరగా ఉంటుంది. ఇప్పటి అనేక అంశాలపై రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక తాజగా ఆయన రోజువారీ డేటా లిమిట్స్తో వచ్చే మొబైల్ రీచార్జ్ ప్లాన్లపై చర్చించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా టెలికాం సంస్థలు 1.5GB, 2GB లేదా 3GB వంటి రోజువారీ డేటా పరిమితులను అందిస్తున్నాయి. అయితే వినియోగదారులు పూర్తిగా డేటా ఉపయోగించకపోతే, మిగిలిన డేటా అర్ధరాత్రి తర్వాత పూర్తిగా రద్దవుతోంది. ఉదాహరణకు, 2GB ప్లాన్ తీసుకున్న వినియోగదారు 1.5GB మాత్రమే వాడితే, మిగిలిన 0.5GB డేటా పూర్తిగా పోతుంది. దీనికి రిఫండ్ లేదా రోల్ఓవర్ వంటి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య
Also Read
- Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
- Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
- IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
ఈ విధానాన్ని విమర్శించిన రాఘవ్ చద్దా.. “డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన డేటా ఎందుకు నష్టపోవాలి?” అని ప్రశ్నించారు. వినియోగదారులకు న్యాయం జరగాలంటే కొన్ని మార్పులు అవసరమని ఆయన సూచించారు. ఇందులో భాగంగా ఆయన పలు డిమాండ్లు ప్రభుత్వం ముందర ఉంచారు.
డేటా రోల్ఓవర్ విధానం:
వాడని డేటా తదుపరి రోజుకు తరలేలా అన్ని టెలికాం కంపెనీలు అవకాశం ఇవ్వాలని కోరారు. రోజు ముగిసిన వెంటనే డేటా తొలగించకుండా, తర్వాతి రోజుకి జోడించాలి అన్నారు.
వాడని డేటాకు సర్దుబాటు:
వినియోగదారులు నిరంతరం తక్కువ డేటా వాడితే, మిగిలిన డేటా విలువను తదుపరి రీచార్జ్లో తగ్గింపు రూపంలో ఇవ్వాలని సూచించారు.
CM Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్కు చెక్.. 24 వేల కోట్లతో మెట్రో విస్తరణ..!
డేటా ట్రాన్స్ఫర్ సౌకర్యం:
వాడని డేటాను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు పంపుకునే విధానం ఉండాలని పేర్కొన్నారు. డేటాను వినియోగదారుల “డిజిటల్ ఆస్తి”గా పరిగణించాలి అన్నారు.
డిజిటల్ ఇండియాలో కీలక అంశం:
డిజిటల్ యుగంలో డేటా అత్యంత కీలకమైన వనరుగా మారింది. ఇలాంటి సమయంలో వినియోగదారులు చెల్లించిన డేటా పూర్తిగా వినియోగించుకునే హక్కు ఉండాలని చద్దా అభిప్రాయపడ్డారు.
Telecom companies offer Recharge Plans with ‘𝐃𝐚𝐢𝐥𝐲 𝐃𝐚𝐭𝐚 𝐋𝐢𝐦𝐢𝐭𝐬’ like 1.5GB, 2GB or 3GB per day, resetting every 24 hours. Any Unused Data EXPIRES at midnight, despite being fully paid for.
𝐘𝐨𝐮 𝐚𝐫𝐞 𝐛𝐢𝐥𝐥𝐞𝐝 𝐟𝐨𝐫 𝟐𝐆𝐁. 𝐘𝐨𝐮 𝐮𝐬𝐞 𝟏.𝟓𝐆𝐁. 𝐓𝐡𝐞… pic.twitter.com/sWiJbKj2AV
— Raghav Chadha (@raghav_chadha) March 23, 2026
తాజావార్తలు
-
Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
-
Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్పై కెప్టెన్ గిల్ రియాక్షన్
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..