PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య
- మధ్యప్రాచ్యం సంక్షోభంపై లోక్సభలో మాట్లాడిన మోడీ
- కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం
- యుద్ధాన్ని ముగించాలని మోడీ పిలుపు
మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభంపై లోక్సభలో మోడీ మాట్లాడారు. ‘‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు అపారమైనవి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నారు. గత రెండు మూడు వారాలుగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కేంద్ర మంత్రి హర్దీప్ పూరి సభకు పశ్చిమాసియా పరిస్థితిపై సవివరంగా వివరించారు. ఈ సంఘర్షణ మూడు వారాలకు పైగా కొనసాగుతోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: గల్ఫ్లో ఉన్న భారతీయుల భద్రతే మా ప్రాధాన్యత.. ఇంధన భద్రతపై ప్రధాని మోడీ హామీ
Also Read
‘‘భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడానికి అనేక చర్యలు తీసుకున్నాం. మేము 41 దేశాల నుంచి ఇంధన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటాము. మధ్యప్రాచ్య సంక్షోభం తర్వాత మేము ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంపై దృష్టి సారించాం. అయితే హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరా గొలుసుకు అంతరాయం కలగడం దిగుమతులపై ప్రభావం చూపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. యుద్ధంలో పాల్గొంటున్న, యుద్ధ ప్రభావిత దేశాలతో భారతదేశానికి విస్తృత వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఈ యుద్ధం జరుగుతున్న ప్రాంతం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో మన వాణిజ్యానికి కూడా హార్ముజ్ ముఖ్యమైన మార్గం. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ అవసరాల్లో అధిక భాగాన్ని తీరుస్తుంది.’’ అని మోడీ పేర్కొన్నారు.
‘‘యుద్ధ ప్రభావం దీర్ఘకాలం ఉండవచ్చు. కరోనా సంక్షోభానికి సిద్ధంగా ఉన్నట్లే మనం కూడా సిద్ధంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నారు. ఈ యుద్ధం ముగుస్తుందో లేదో అనిశ్చితంగా ఉంది. అయితే ఈ సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. భారతదేశం కూడా గ్యాస్ కొరతను ఎదుర్కొంటోంది. యుద్ధాన్ని ముగించాలని భారత్ కూడా కోరుతోంది.’’ అని అన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో