Man Missing: పుతిన్ను విమర్శిస్తే అంతే సంగతులు.. ఒడిశాలో మరో వ్యక్తి మిస్సింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Missing: ఉక్రెయిన్పై భీకరంగా దాడులు చేస్తోన్న రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ దేశ పౌరులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన చట్టసభ సభ్యుడు, వ్యాపారవేత్త పావెల్ ఆంటోవ్, అతని సన్నిహితుడు వ్లాదిమిర్ బిడెనోవ్లు ఇద్దరూ కూడా రెండ్రోజుల వ్యవధిలో రాయగడ జిల్లాలోని ఒక హోటల్లో రక్తపు మడుగులో పడి కనిపించటం కలకలం రేపింది. తాజాగా పుతిన్ను వ్యతిరేకించిన మరో రష్యా పౌరుడు కనిపించకుండా పోయాడనే వార్త కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర పోలీసులు రష్యాకు చెందిన ఆ వ్యక్తి కోసం శోధిస్తున్నారు. కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి ఉక్రెయిన్ యుద్ధ వ్యతిరేక కార్యకర్త, స్వయం ప్రకటిత ఉక్రెయిన్ యుద్ధ కార్యకర్త.
ఈ తప్పిపోయిన వ్యక్తి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను విమర్శించేవాడు. గతంలో ఒడిశా రాజధానిలో యుద్ధ వ్యతిరేక, పుతిన్ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని కనిపించాడు. ఒక నెల క్రితం ఆ వ్యక్తి భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో “నేను రష్యన్ రెఫ్యూజీని, నేను యుద్ధానికి వ్యతిరేకిని, నేను పుతిన్కు వ్యతిరేకిని, నేను నిరాశ్రయుడిని, దయచేసి నాకు సహాయం చేయండి” అనే ప్లకార్డును పట్టుకుని కనిపించాడు. మరోవైపు.. రైల్వే స్టేషన్లో ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి ఆచూకీ గల్లంతైనట్లు వార్తలు చక్కర్లు కొంటాయి. ఆయనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాయి. ఒడిశా రాయగడలోని హోటల్లో ఇద్దరు రష్యన్ వ్యక్తులు మరణించిన క్రమంలో ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, ఆ వార్తలను ఒడిశా పోలీసులు కొట్టిపారేశారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
- Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
Russia New Year Gift : రష్యా న్యూ ఇయర్ గిఫ్ట్.. వారికి ఆదాయపన్ను లేనట్లే
అయితే ఇప్పటివరకు ఎలాంచి మిస్సింగ్ కేసు నమోదు కాలేదని రైల్వే పోలీసులు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. . రాయగడ హోటల్ ఘటనలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. డిసెంబరు 24న హోటల్ మూడో అంతస్తు నుంచి పడి పావెల్ ఆంటోవ్ మరణించగా, డిసెంబరు 22న బిడెనోవ్ తన గదిలో శవమై కనిపించాడు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లోని రైల్వే అధికారులు నెల రోజుల క్రితం ఆ పోస్టర్ పట్టుకున్న వ్యక్తితో మాట్లాడారు.
తాజావార్తలు
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!