Purandeswari: నిర్మలా సీతారామన్కి పురంధేశ్వరి లేఖ.. జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు..!
Purandeswari: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.. ఏపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా.. సీఎం జగన్, వైసీపీ సర్కార్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. ఇక, తాజాగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖరాశారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.. వైఎస్ జగన్ ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా అప్పులు చేస్తోందంటూ ఫిర్యాదు చేశారు.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏయే విధంగా అప్పులు చేసిందనే వివరాలను లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి.. నాలుగేళ్ల వైసీపీ పాలనలో రూ.7.15 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకుందని లేఖలో వెల్లడించారు. ఉద్యోగులకివ్వాల్సి పీఎఫ్ క్లైమ్స్.. డీఏలు కూడా భారీగా పెండింగులో ఉన్నాయన కేంద్ర ఆర్థికమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి. లిక్కర్ ఆదాయం తాకట్టు పెట్టి ఇప్పటికే తీసుకున్న అప్పులే కాకుండా మరిన్ని అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని లేఖలో స్పష్టం చేశారు.. ఆంధ్రప్రదేశ్లో జరుగుతోన్న ఆర్థిక అవకతవకలపై సమీక్షించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను లేఖలో కోరారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
కాగా, ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని.. కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయని గతంలో పురంధేశ్వరి తెలిపిన విషయం విదితమే.. ఏపీకి కేంద్రం 25 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని.. గడచిన తొమ్మిదేళ్లలో రూ.20 వేల కోట్లు ఒక్క పీఎమ్ఏవై కింద ఇచ్చిందని తెలిపారు. ఇక, ఆంధ్రప్రదేశ్కి ఎన్ఆర్జీపీ కింద 2022 – 23 వరకు 8 వేలకు కోట్లకు పైగా వచ్చాయని.. రాష్ట్రంలో 90 లక్షల మందికి ఉచిత బియ్యం అందుతోందుతున్నాయని ఆమె పేర్కొన్నారు.. ఈ ఏడాది బియ్యం ద్వారా 10 వేల కోట్లకు పైగా రాష్ట్రానికి అందిందన్నారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రతీ రైతుకు రూ.12 వేలు ఇస్తామన్న హమీ ఏమైందని ప్రశ్నించారు.. కేంద్రం ఇస్తున్న రూ.6 వేలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.46,836 కోట్లు గ్రాంట్లు ద్వారా రాష్ట్రానికి అందిస్తుందని.. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నేరుగా సర్పంచ్ల అకౌంట్లలోకి నిధులు విడుదల చేస్తుంటే ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సీఎం జగన్పై పురంధేశ్వరి ధ్వజమెత్తిన విషయం విదితమే.
Also Read
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
తాజావార్తలు
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!