Man kills Friend: దారుణం.. బీమా డబ్బుకు ఆశపడి స్నేహితుడిని చంపి, తానే చనిపోయానని నమ్మించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man kills Friend: నష్టాల బారినపడిన ఒక వ్యాపారవేత్త తాను చనిపోయానని నమ్మించి బీమా డబ్బును క్లెయిమ్ చేయడానికి ఓ వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గురుప్రీత్ సింగ్, అతని భార్య ఖుష్దీప్ కౌర్తో పాటు మరో నలుగురు కలిసి సుఖ్జీత్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసినందుకు గానూ అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రవ్జోత్ కౌర్ గ్రేవాల్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్జీత్ అదృశ్యమైనట్లు అతని భార్య జీవన్దీప్ కౌర్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గురుప్రీత్ అనే వ్యాపారవేత్త తన వ్యాపారంలో నష్టాలను చవిచూశాడని, అతని భార్యతో పాటు మరో నలుగురు – సుఖ్వీందర్ సింగ్ సంఘా, జస్పాల్ సింగ్, దినేష్ కుమార్, రాజేష్ కుమార్తో కలిసి 4 కోట్ల రూపాయల భీమా డబ్బును క్లెయిమ్ చేయడానికి గురుప్రీత్ మరణాన్ని నకిలీ చేసి డబ్బును పొందాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
Also Read: Software Employee: రైలులో ఉండగా ఫోన్ ను కర్రతో కొట్టిన దుండగులు.. కిందపడి టెక్కి మృతి
అసలు జరిగిందేమిటంటే?
సైన్పూర్ ప్రాంతానికి చెందిన సుఖ్జీత్ను చంపాలనే ఉద్దేశంతో గురుప్రీత్ అతనితో స్నేహం పెంచుకున్నాడు. కొన్ని రోజుల పాటు అతనితో స్నేహంగా ఉంటున్నట్లు నటించాడు. సుఖ్జీత్కు ప్రతిరోజు మద్యం తాగించేవాడు. జూన్ 19న, గుర్ప్రీత్ సుఖ్జీత్కు బాగా మద్యం తాగించాడు. దీంతో అతను స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అతడిని చంపేసిన అనంతరం గురుప్రీత్ మృతుడి బట్టలు మార్చుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తించలేనంతగా ట్రక్కు కింద పడేసి తొక్కించాడని పోలీసులు తెలిపారు. గురుప్రీత్ భార్య సుఖ్జీత్ మృతదేహాన్ని తన భర్తదిగా గుర్తించినట్లు వారు తెలిపారు. విచారణలో, గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని అతని కుటుంబం జూన్ 20న రాజ్పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తేలింది.
గురుప్రీత్ గత కొన్ని రోజులుగా తన భర్తకు మద్యం కొంటున్నాడని సుఖ్జీత్ భార్య పోలీసులకు తెలిపింది. దీనిపై పోలీసులు విచారించగా, గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీంతో అనుమానం వచ్చి గురుప్రీత్ కుటుంబీకులను మళ్లీ విచారించారు. గురుప్రీత్ బతికే ఉన్నాడని, రూ.4 కోట్ల విలువైన బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకునేందుకు అతని భార్య, ఇతరులతో కలిసి అతని మరణాన్ని నకిలీ చేసేందుకు కుట్ర పన్నాడని అప్పుడు తేలిందని వారు తెలిపారు. దీంతో గురుప్రీత్, అతని భార్యతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..