Man kills Friend: దారుణం.. బీమా డబ్బుకు ఆశపడి స్నేహితుడిని చంపి, తానే చనిపోయానని నమ్మించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man kills Friend: నష్టాల బారినపడిన ఒక వ్యాపారవేత్త తాను చనిపోయానని నమ్మించి బీమా డబ్బును క్లెయిమ్ చేయడానికి ఓ వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గురుప్రీత్ సింగ్, అతని భార్య ఖుష్దీప్ కౌర్తో పాటు మరో నలుగురు కలిసి సుఖ్జీత్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసినందుకు గానూ అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రవ్జోత్ కౌర్ గ్రేవాల్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్జీత్ అదృశ్యమైనట్లు అతని భార్య జీవన్దీప్ కౌర్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గురుప్రీత్ అనే వ్యాపారవేత్త తన వ్యాపారంలో నష్టాలను చవిచూశాడని, అతని భార్యతో పాటు మరో నలుగురు – సుఖ్వీందర్ సింగ్ సంఘా, జస్పాల్ సింగ్, దినేష్ కుమార్, రాజేష్ కుమార్తో కలిసి 4 కోట్ల రూపాయల భీమా డబ్బును క్లెయిమ్ చేయడానికి గురుప్రీత్ మరణాన్ని నకిలీ చేసి డబ్బును పొందాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
Also Read: Software Employee: రైలులో ఉండగా ఫోన్ ను కర్రతో కొట్టిన దుండగులు.. కిందపడి టెక్కి మృతి
అసలు జరిగిందేమిటంటే?
సైన్పూర్ ప్రాంతానికి చెందిన సుఖ్జీత్ను చంపాలనే ఉద్దేశంతో గురుప్రీత్ అతనితో స్నేహం పెంచుకున్నాడు. కొన్ని రోజుల పాటు అతనితో స్నేహంగా ఉంటున్నట్లు నటించాడు. సుఖ్జీత్కు ప్రతిరోజు మద్యం తాగించేవాడు. జూన్ 19న, గుర్ప్రీత్ సుఖ్జీత్కు బాగా మద్యం తాగించాడు. దీంతో అతను స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అతడిని చంపేసిన అనంతరం గురుప్రీత్ మృతుడి బట్టలు మార్చుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తించలేనంతగా ట్రక్కు కింద పడేసి తొక్కించాడని పోలీసులు తెలిపారు. గురుప్రీత్ భార్య సుఖ్జీత్ మృతదేహాన్ని తన భర్తదిగా గుర్తించినట్లు వారు తెలిపారు. విచారణలో, గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని అతని కుటుంబం జూన్ 20న రాజ్పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తేలింది.
గురుప్రీత్ గత కొన్ని రోజులుగా తన భర్తకు మద్యం కొంటున్నాడని సుఖ్జీత్ భార్య పోలీసులకు తెలిపింది. దీనిపై పోలీసులు విచారించగా, గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీంతో అనుమానం వచ్చి గురుప్రీత్ కుటుంబీకులను మళ్లీ విచారించారు. గురుప్రీత్ బతికే ఉన్నాడని, రూ.4 కోట్ల విలువైన బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకునేందుకు అతని భార్య, ఇతరులతో కలిసి అతని మరణాన్ని నకిలీ చేసేందుకు కుట్ర పన్నాడని అప్పుడు తేలిందని వారు తెలిపారు. దీంతో గురుప్రీత్, అతని భార్యతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!