Man kills Friend: దారుణం.. బీమా డబ్బుకు ఆశపడి స్నేహితుడిని చంపి, తానే చనిపోయానని నమ్మించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man kills Friend: నష్టాల బారినపడిన ఒక వ్యాపారవేత్త తాను చనిపోయానని నమ్మించి బీమా డబ్బును క్లెయిమ్ చేయడానికి ఓ వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గురుప్రీత్ సింగ్, అతని భార్య ఖుష్దీప్ కౌర్తో పాటు మరో నలుగురు కలిసి సుఖ్జీత్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసినందుకు గానూ అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రవ్జోత్ కౌర్ గ్రేవాల్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్జీత్ అదృశ్యమైనట్లు అతని భార్య జీవన్దీప్ కౌర్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గురుప్రీత్ అనే వ్యాపారవేత్త తన వ్యాపారంలో నష్టాలను చవిచూశాడని, అతని భార్యతో పాటు మరో నలుగురు – సుఖ్వీందర్ సింగ్ సంఘా, జస్పాల్ సింగ్, దినేష్ కుమార్, రాజేష్ కుమార్తో కలిసి 4 కోట్ల రూపాయల భీమా డబ్బును క్లెయిమ్ చేయడానికి గురుప్రీత్ మరణాన్ని నకిలీ చేసి డబ్బును పొందాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
Also Read: Software Employee: రైలులో ఉండగా ఫోన్ ను కర్రతో కొట్టిన దుండగులు.. కిందపడి టెక్కి మృతి
అసలు జరిగిందేమిటంటే?
సైన్పూర్ ప్రాంతానికి చెందిన సుఖ్జీత్ను చంపాలనే ఉద్దేశంతో గురుప్రీత్ అతనితో స్నేహం పెంచుకున్నాడు. కొన్ని రోజుల పాటు అతనితో స్నేహంగా ఉంటున్నట్లు నటించాడు. సుఖ్జీత్కు ప్రతిరోజు మద్యం తాగించేవాడు. జూన్ 19న, గుర్ప్రీత్ సుఖ్జీత్కు బాగా మద్యం తాగించాడు. దీంతో అతను స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అతడిని చంపేసిన అనంతరం గురుప్రీత్ మృతుడి బట్టలు మార్చుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తించలేనంతగా ట్రక్కు కింద పడేసి తొక్కించాడని పోలీసులు తెలిపారు. గురుప్రీత్ భార్య సుఖ్జీత్ మృతదేహాన్ని తన భర్తదిగా గుర్తించినట్లు వారు తెలిపారు. విచారణలో, గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని అతని కుటుంబం జూన్ 20న రాజ్పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తేలింది.
గురుప్రీత్ గత కొన్ని రోజులుగా తన భర్తకు మద్యం కొంటున్నాడని సుఖ్జీత్ భార్య పోలీసులకు తెలిపింది. దీనిపై పోలీసులు విచారించగా, గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీంతో అనుమానం వచ్చి గురుప్రీత్ కుటుంబీకులను మళ్లీ విచారించారు. గురుప్రీత్ బతికే ఉన్నాడని, రూ.4 కోట్ల విలువైన బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకునేందుకు అతని భార్య, ఇతరులతో కలిసి అతని మరణాన్ని నకిలీ చేసేందుకు కుట్ర పన్నాడని అప్పుడు తేలిందని వారు తెలిపారు. దీంతో గురుప్రీత్, అతని భార్యతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!