Dog Meat Eating Remark: కుక్క మాంసంపై మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. అస్సాం అసెంబ్లీలో దుమారం
Dog Meat Eating Remark: అస్సాం ప్రజలు కుక్క మాంసం తినే అలవాట్లపై మహారాష్ట్ర ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో శుక్రవారం అస్సాం అసెంబ్లీలో దుమారం చెలరేగింది. ప్రతిపక్ష శాసనసభ్యులు గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ప్రసంగానికి అంతరాయం కలిగించి అనంతరం వాకౌట్ చేశారు. విపక్ష ఎమ్మెల్యేలు లేచి నిలబడి నినాదాలు చేయడంతో పాటు ఆ శాసనసభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరుతూ డిమాండ్ చేశారు. దీంతో గవర్నర్ గులాబ్ చంద్ కటారియా తన ప్రసంగాన్ని 15 నిమిషాలకు కుదించవలసి వచ్చింద. ఈశాన్య రాష్ట్రంలోని స్థానికులు వాటిని తినేస్తున్నందున, వాటి పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి వీధికుక్కలను అస్సాంకు పంపాలని ఎమ్మెల్యే బచ్చు కడు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపాదించారు.
ఈ అంశాన్ని మొదట కాంగ్రెస్ శాసనసభ్యుడు కమలాఖ్య డే పుర్కయస్తా లేవనెత్తారు. ఎమ్మెల్యే కడుపై అస్సాం ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందని ప్రశ్నించారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకుడు పవన్ ఖేరాను అరెస్టు చేయడానికి రాష్ట్రానికి చెందిన పోలీసు బృందం ఇటీవల న్యూఢిల్లీకి చేరుకుందని.. కానీ మహారాష్ట్ర ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
Also Read
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
Read Also: PM Narendra Modi: ఆస్ట్రేలియా ప్రధానితో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన మోదీ..
ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే రఫీకుల్ ఇస్లాం స్పీకర్ బిస్వజిత్ డైమరీని కడు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రత్యేక హక్కును ఉల్లంఘించినందుకు సుమోటోగా విచారణకు తీసుకోవాలని, అస్సాం అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పమని”కోరారు. స్వతంత్ర శాసనసభ్యుడు అఖిల్ గొగోయ్, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మనోరంజన్ తాలూక్దార్ కూడా తమ మహారాష్ట్ర కౌంటర్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష శాసనసభ్యులతో కలిసిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్ ఆఫ్ హౌస్లోకి వెళ్లడంతో, డైమరీ వారిని తమ స్థానాల్లోకి తిరిగి రావాలని, సరైన మార్గాల ద్వారా విషయాన్ని సంప్రదించాలని కోరారు. ఈ గందరగోళం మధ్య విపక్ష ఎమ్మెల్యేలంతా వాకౌట్ చేశారు.
తాజావార్తలు
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!