Dog Meat Eating Remark: కుక్క మాంసంపై మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. అస్సాం అసెంబ్లీలో దుమారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dog Meat Eating Remark: అస్సాం ప్రజలు కుక్క మాంసం తినే అలవాట్లపై మహారాష్ట్ర ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో శుక్రవారం అస్సాం అసెంబ్లీలో దుమారం చెలరేగింది. ప్రతిపక్ష శాసనసభ్యులు గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ప్రసంగానికి అంతరాయం కలిగించి అనంతరం వాకౌట్ చేశారు. విపక్ష ఎమ్మెల్యేలు లేచి నిలబడి నినాదాలు చేయడంతో పాటు ఆ శాసనసభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరుతూ డిమాండ్ చేశారు. దీంతో గవర్నర్ గులాబ్ చంద్ కటారియా తన ప్రసంగాన్ని 15 నిమిషాలకు కుదించవలసి వచ్చింద. ఈశాన్య రాష్ట్రంలోని స్థానికులు వాటిని తినేస్తున్నందున, వాటి పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి వీధికుక్కలను అస్సాంకు పంపాలని ఎమ్మెల్యే బచ్చు కడు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపాదించారు.
ఈ అంశాన్ని మొదట కాంగ్రెస్ శాసనసభ్యుడు కమలాఖ్య డే పుర్కయస్తా లేవనెత్తారు. ఎమ్మెల్యే కడుపై అస్సాం ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందని ప్రశ్నించారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకుడు పవన్ ఖేరాను అరెస్టు చేయడానికి రాష్ట్రానికి చెందిన పోలీసు బృందం ఇటీవల న్యూఢిల్లీకి చేరుకుందని.. కానీ మహారాష్ట్ర ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Read Also: PM Narendra Modi: ఆస్ట్రేలియా ప్రధానితో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన మోదీ..
ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే రఫీకుల్ ఇస్లాం స్పీకర్ బిస్వజిత్ డైమరీని కడు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రత్యేక హక్కును ఉల్లంఘించినందుకు సుమోటోగా విచారణకు తీసుకోవాలని, అస్సాం అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పమని”కోరారు. స్వతంత్ర శాసనసభ్యుడు అఖిల్ గొగోయ్, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మనోరంజన్ తాలూక్దార్ కూడా తమ మహారాష్ట్ర కౌంటర్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష శాసనసభ్యులతో కలిసిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్ ఆఫ్ హౌస్లోకి వెళ్లడంతో, డైమరీ వారిని తమ స్థానాల్లోకి తిరిగి రావాలని, సరైన మార్గాల ద్వారా విషయాన్ని సంప్రదించాలని కోరారు. ఈ గందరగోళం మధ్య విపక్ష ఎమ్మెల్యేలంతా వాకౌట్ చేశారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!