Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Protecting A Terrorist Is Equivalent To Promoting Terror Says Home Minister Amit Shah

Amit Shah: టెర్రరిస్ట్‌ను రక్షించడం అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానం

Published Date :November 18, 2022 , 3:21 pm
By Mahesh Jakki
Amit Shah: టెర్రరిస్ట్‌ను రక్షించడం అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Central Home Minister Amit Shah: ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం అత్యంత తీవ్రమైన ముప్పు అని, ఉగ్రవాదిని రక్షించడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం అన్నారు. టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ టెర్రరిజంలో గ్లోబల్ ట్రెండ్స్ అనే అంశంపై జరిగిన మూడో ‘నో మనీ ఫర్ టెర్రర్’ మంత్రివర్గ సదస్సు తొలి సెషన్‌కు అధ్యక్షత వహించిన సందర్భంగా షా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాదం నిస్సందేహంగా ప్రపంచ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పు అని.. అయితే ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడం చాలా ప్రమాదకరమని అమిత్‌ షా తన ప్రారంభ ప్రసంగంలో తెలిపారు.ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆయన అన్నారు. భారతదేశం ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలు, వ్యక్తీకరణలను ఖండిస్తుందని.. అమాయకుల ప్రాణాలను తీయడం వంటి చర్యను ఏ కారణం కూడా సమర్థించదని అమిత్‌ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల బాధితులకు తన సానుభూతిని తెలియజేస్తూ, ఈ దుర్మార్గంతో మనం ఎన్నటికీ రాజీపడకూడదని హోంమంత్రి అన్నారు.భారతదేశం కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని కేంద్ర హోం మంత్రి అన్నారు.భారత భద్రతా బలగాలు, పౌరులు అత్యంత తీవ్రమైన తీవ్రవాద హింసాత్మక సంఘటనలను ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన అన్నారు.

ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా ఖండించాలని అంతర్జాతీయ సమాజం సామూహిక విధానాన్ని కలిగి ఉందని, అయితే సాంకేతిక విప్లవం కారణంగా ఉగ్రవాదం, దాని రూపాలు, వ్యక్తీకరణలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని షా అన్నారు.టెర్రరిస్టులు, టెర్రరిస్టు గ్రూపులు ఆధునిక ఆయుధాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సూక్ష్మ నైపుణ్యాలను, సైబర్, ఫైనాన్షియల్ స్పేస్ గతిశీలతను బాగా అర్థం చేసుకుని వాటిని ఉపయోగించుకుంటున్నాయని కూడా హోం మంత్రి చెప్పారు.ఉగ్రవాదం డైనమైట్‌ నుంచి మెటావర్స్‌గానూ, ఏకే-47 నుంచి వర్చువల్‌ అసెట్స్‌గానూ మారడం కచ్చితంగా ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశమని, దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు మనమందరం కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. ఉగ్రవాద ముప్పు ఏ మతం, జాతీయత లేదా సమూహంతో ముడిపడి ఉండదని మేము గుర్తించామని షా తెలిపారు.

PM Narendra Modi: యుద్ధం లేకపోవడం అంటే శాంతి కాదు.. పాకిస్తాన్‌కి పరోక్ష హెచ్చరికలు

ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడాన్ని నిరోధించేందుకు భారతదేశం వ్యూహంలో ఆరు అంశాలను హోంమంత్రి జాబితా చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులను రక్షించడం, ఆశ్రయం ఇవ్వడం చూశామన్న అమిత్‌ షా.. ఉగ్రవాదిని రక్షించడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానమని అన్నారు. ఉగ్రవాదుల సురక్షిత స్వర్గధామాలను లేదా వారి వనరులను మనం ఎన్నటికీ విస్మరించకూడదన్నారు. వారికి మద్దతు ఇచ్చే వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదన్నారు. గత కొన్నేళ్లుగా ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో భారతదేశం టెర్రర్ ఫైనాన్సింగ్‌ను అరికట్టడంలో విజయం సాధించిందని అమిత్‌ షా అన్నారు.

‘నో మనీ ఫర్ టెర్రర్’ లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచంలోని దేశాలు టెర్రర్ ఫైనాన్సింగ్ “మోడ్ – మీడియం – మెథడ్”ని అర్థం చేసుకోవాలని, వాటిని అణిచివేసేందుకు ‘ఒక మనస్సు, ఒకే విధానం’ సూత్రాన్ని అనుసరించాలని షా అన్నారు. రాడికల్ కంటెంట్‌ను వ్యాప్తి చేయడానికి, వారి గుర్తింపులను దాచడానికి ఉగ్రవాదులు డార్క్‌నెట్‌ను ఉపయోగిస్తున్నారని అమిత్‌ షా తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • amit shah on finance terrorism
  • amit shah on terrorism
  • no money for terror
  • no money for terror conference

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions