Amit Shah: టెర్రరిస్ట్ను రక్షించడం అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Home Minister Amit Shah: ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం అత్యంత తీవ్రమైన ముప్పు అని, ఉగ్రవాదిని రక్షించడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం అన్నారు. టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ టెర్రరిజంలో గ్లోబల్ ట్రెండ్స్ అనే అంశంపై జరిగిన మూడో ‘నో మనీ ఫర్ టెర్రర్’ మంత్రివర్గ సదస్సు తొలి సెషన్కు అధ్యక్షత వహించిన సందర్భంగా షా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదం నిస్సందేహంగా ప్రపంచ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పు అని.. అయితే ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడం చాలా ప్రమాదకరమని అమిత్ షా తన ప్రారంభ ప్రసంగంలో తెలిపారు.ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆయన అన్నారు. భారతదేశం ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలు, వ్యక్తీకరణలను ఖండిస్తుందని.. అమాయకుల ప్రాణాలను తీయడం వంటి చర్యను ఏ కారణం కూడా సమర్థించదని అమిత్ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల బాధితులకు తన సానుభూతిని తెలియజేస్తూ, ఈ దుర్మార్గంతో మనం ఎన్నటికీ రాజీపడకూడదని హోంమంత్రి అన్నారు.భారతదేశం కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని కేంద్ర హోం మంత్రి అన్నారు.భారత భద్రతా బలగాలు, పౌరులు అత్యంత తీవ్రమైన తీవ్రవాద హింసాత్మక సంఘటనలను ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన అన్నారు.
Also Read
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా ఖండించాలని అంతర్జాతీయ సమాజం సామూహిక విధానాన్ని కలిగి ఉందని, అయితే సాంకేతిక విప్లవం కారణంగా ఉగ్రవాదం, దాని రూపాలు, వ్యక్తీకరణలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని షా అన్నారు.టెర్రరిస్టులు, టెర్రరిస్టు గ్రూపులు ఆధునిక ఆయుధాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సూక్ష్మ నైపుణ్యాలను, సైబర్, ఫైనాన్షియల్ స్పేస్ గతిశీలతను బాగా అర్థం చేసుకుని వాటిని ఉపయోగించుకుంటున్నాయని కూడా హోం మంత్రి చెప్పారు.ఉగ్రవాదం డైనమైట్ నుంచి మెటావర్స్గానూ, ఏకే-47 నుంచి వర్చువల్ అసెట్స్గానూ మారడం కచ్చితంగా ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశమని, దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు మనమందరం కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. ఉగ్రవాద ముప్పు ఏ మతం, జాతీయత లేదా సమూహంతో ముడిపడి ఉండదని మేము గుర్తించామని షా తెలిపారు.
PM Narendra Modi: యుద్ధం లేకపోవడం అంటే శాంతి కాదు.. పాకిస్తాన్కి పరోక్ష హెచ్చరికలు
ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడాన్ని నిరోధించేందుకు భారతదేశం వ్యూహంలో ఆరు అంశాలను హోంమంత్రి జాబితా చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులను రక్షించడం, ఆశ్రయం ఇవ్వడం చూశామన్న అమిత్ షా.. ఉగ్రవాదిని రక్షించడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానమని అన్నారు. ఉగ్రవాదుల సురక్షిత స్వర్గధామాలను లేదా వారి వనరులను మనం ఎన్నటికీ విస్మరించకూడదన్నారు. వారికి మద్దతు ఇచ్చే వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదన్నారు. గత కొన్నేళ్లుగా ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో భారతదేశం టెర్రర్ ఫైనాన్సింగ్ను అరికట్టడంలో విజయం సాధించిందని అమిత్ షా అన్నారు.
‘నో మనీ ఫర్ టెర్రర్’ లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచంలోని దేశాలు టెర్రర్ ఫైనాన్సింగ్ “మోడ్ – మీడియం – మెథడ్”ని అర్థం చేసుకోవాలని, వాటిని అణిచివేసేందుకు ‘ఒక మనస్సు, ఒకే విధానం’ సూత్రాన్ని అనుసరించాలని షా అన్నారు. రాడికల్ కంటెంట్ను వ్యాప్తి చేయడానికి, వారి గుర్తింపులను దాచడానికి ఉగ్రవాదులు డార్క్నెట్ను ఉపయోగిస్తున్నారని అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
-
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
-
Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
-
Ducati 2026 Multistrada V4 Rally: భారత్లో విడుదలైన డుకాటి 2026 మల్టీస్ట్రాడా V4 ర్యాలీ.. ధర రూ. 32 లక్షలు
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..