Amit Shah: టెర్రరిస్ట్ను రక్షించడం అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానం
Central Home Minister Amit Shah: ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం అత్యంత తీవ్రమైన ముప్పు అని, ఉగ్రవాదిని రక్షించడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం అన్నారు. టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ టెర్రరిజంలో గ్లోబల్ ట్రెండ్స్ అనే అంశంపై జరిగిన మూడో ‘నో మనీ ఫర్ టెర్రర్’ మంత్రివర్గ సదస్సు తొలి సెషన్కు అధ్యక్షత వహించిన సందర్భంగా షా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదం నిస్సందేహంగా ప్రపంచ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పు అని.. అయితే ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడం చాలా ప్రమాదకరమని అమిత్ షా తన ప్రారంభ ప్రసంగంలో తెలిపారు.ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆయన అన్నారు. భారతదేశం ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలు, వ్యక్తీకరణలను ఖండిస్తుందని.. అమాయకుల ప్రాణాలను తీయడం వంటి చర్యను ఏ కారణం కూడా సమర్థించదని అమిత్ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల బాధితులకు తన సానుభూతిని తెలియజేస్తూ, ఈ దుర్మార్గంతో మనం ఎన్నటికీ రాజీపడకూడదని హోంమంత్రి అన్నారు.భారతదేశం కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని కేంద్ర హోం మంత్రి అన్నారు.భారత భద్రతా బలగాలు, పౌరులు అత్యంత తీవ్రమైన తీవ్రవాద హింసాత్మక సంఘటనలను ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన అన్నారు.
Also Read
ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా ఖండించాలని అంతర్జాతీయ సమాజం సామూహిక విధానాన్ని కలిగి ఉందని, అయితే సాంకేతిక విప్లవం కారణంగా ఉగ్రవాదం, దాని రూపాలు, వ్యక్తీకరణలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని షా అన్నారు.టెర్రరిస్టులు, టెర్రరిస్టు గ్రూపులు ఆధునిక ఆయుధాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సూక్ష్మ నైపుణ్యాలను, సైబర్, ఫైనాన్షియల్ స్పేస్ గతిశీలతను బాగా అర్థం చేసుకుని వాటిని ఉపయోగించుకుంటున్నాయని కూడా హోం మంత్రి చెప్పారు.ఉగ్రవాదం డైనమైట్ నుంచి మెటావర్స్గానూ, ఏకే-47 నుంచి వర్చువల్ అసెట్స్గానూ మారడం కచ్చితంగా ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశమని, దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు మనమందరం కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. ఉగ్రవాద ముప్పు ఏ మతం, జాతీయత లేదా సమూహంతో ముడిపడి ఉండదని మేము గుర్తించామని షా తెలిపారు.
PM Narendra Modi: యుద్ధం లేకపోవడం అంటే శాంతి కాదు.. పాకిస్తాన్కి పరోక్ష హెచ్చరికలు
ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడాన్ని నిరోధించేందుకు భారతదేశం వ్యూహంలో ఆరు అంశాలను హోంమంత్రి జాబితా చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులను రక్షించడం, ఆశ్రయం ఇవ్వడం చూశామన్న అమిత్ షా.. ఉగ్రవాదిని రక్షించడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానమని అన్నారు. ఉగ్రవాదుల సురక్షిత స్వర్గధామాలను లేదా వారి వనరులను మనం ఎన్నటికీ విస్మరించకూడదన్నారు. వారికి మద్దతు ఇచ్చే వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదన్నారు. గత కొన్నేళ్లుగా ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో భారతదేశం టెర్రర్ ఫైనాన్సింగ్ను అరికట్టడంలో విజయం సాధించిందని అమిత్ షా అన్నారు.
‘నో మనీ ఫర్ టెర్రర్’ లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచంలోని దేశాలు టెర్రర్ ఫైనాన్సింగ్ “మోడ్ – మీడియం – మెథడ్”ని అర్థం చేసుకోవాలని, వాటిని అణిచివేసేందుకు ‘ఒక మనస్సు, ఒకే విధానం’ సూత్రాన్ని అనుసరించాలని షా అన్నారు. రాడికల్ కంటెంట్ను వ్యాప్తి చేయడానికి, వారి గుర్తింపులను దాచడానికి ఉగ్రవాదులు డార్క్నెట్ను ఉపయోగిస్తున్నారని అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!