Prof. Kodandaram : కేంద్రం, రాష్ట్రం కలిసి సింగరేణిని దోచుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జన సమితి ఉంటుంది.. అనుమానం వద్దని తెలిపారు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని శక్తులు ఏకం కావాల్సిన అవసరం వచ్చిందని, కేసీఆర్ ప్రభుత్త్వాన్ని ఆస్తులు పెంచుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. నిరంకుశ పాలన ప్రజల మీద రుద్దుతున్నారని, కేసీఆర్ వచ్చాకా… రాజకీయాలు కార్పోరేట్ గా మారిందన్నారు. అధికారాన్ని, డబ్బులను విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారని, రాజకీయ విశ్లేషణ కూడా మార్కెటికరణ గా మార్చేశారన్నారు. ప్రజలకు ప్రభుత్వం దూరం అయ్యిందని, దుర్మార్గ.. నిరంకుశ పాలన కొనసాగుతుందని, ప్రజల చుట్టూ రాజకీయం తిప్పాలన్నారు. అందరిని ఏకతాటిపైకి తీసుకు వస్తామని, . ఉద్యమంలో కలిసి వచ్చిన వారిని అందరిని ఏకం చేస్తామని కోదండరాం వెల్లడించారు. ఈ నెల 21 నుండి యాత్ర చేస్తున్నామని, తెలంగాణ పరిరక్షణ సదస్సులు నిర్వహిస్తామని, ధరణి లోపాలు వెంటనే సరిదిద్దాలన్నారు.
Also Read : Cucumber: కీరదోసతో మరింత అందం.. ఇంకెందుకు ఆలస్యం తినేయండి..!
Also Read
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
పంట నష్టపోయిన వారికి పరిహారం ఇస్తానన్న 10 వేలు వెంటనే విడుదల చేయాలని, కేంద్రం, రాష్ట్రం కలిసి సింగరేణిని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం మీద రాష్ట్రం.. రాష్ట్రం మీద కేంద్రం విమర్శలు చేసుకుంటున్నాయని, కానీ రెండు ప్రభుత్వాలు సింగరేణిని దోచుకుంటున్నారన్నారు. జనసమితి రాష్ట్ర అధ్యక్దుడు గా రెండో సారి కోదండరాం ఎన్నికయ్యారు. అయితే.. ఇదే ఆఖరి .. నెక్ట్ కొత్త వాళ్లకు అవకాశం ఇస్తామని ఆయన వెల్లడించారు. దిక్కులు చూడటం మానేసి..మా పని మేము చేసుకుందాం అని డిసైడ్ అయ్యామన్నారు. ఆ తర్వాతే.. పొత్తు లు.. ఎత్తులు అంటూ కోదండరాం వ్యాఖ్యానించారు. పైసలతో రాజకీయం తెలంగాణను విధ్వంసం చేస్తున్నాయని, కేసీఆర్ పాలన లో రాజకీయంగా దోపిడికి గురికాని ఊరు లేదన్నారు. ఎన్నికలు ఆటగా మారాయి.. ప్రజల భవిష్యత్ కి వేదికగా మారాలని మా ప్రయత్నం.. గెలుపు ఓటమి సమస్య కాదు.. కొట్లాడటం అనేది అజెండా.. అంతకు మించిన మార్గం మా దగ్గర లేదు.. ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలేదు..’ అని ఆయన అన్నారు.
Also Read : Bengaluru: 25 మంది ఆఫ్రికా జాతీయుల అరెస్ట్.. డ్రగ్స్ వ్యతిరేక కేసులు నమోదు..
తాజావార్తలు
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!