Dil Raju: నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్!
- నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్
- తమ్ముడు చిత్రానికి టికెట్ ధరలు పెంచము
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు ఆదర్శం
- ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్ చేశారు. తన సినిమాలకు టికెట్ ధరలు పెంచనని, ‘తమ్ముడు’ చిత్రానికి ధరలు పెంచమని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అడగను అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శం అని, తాను పవన్ సూచనలను అనుసరిస్తా అని చెప్పారు. థియేటర్లలో ధరల నియంత్రణ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన సూచనలు ఫాలో అవుతున్నానని పేర్కొన్నారు. ఏపీలో థియేటర్లలో ధరల నియంత్రణకు డిప్యూటీ సీఎం పవన్ తీసుకున్న చర్యల గురించి తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ప్రతిపాదించామని దిల్ రాజు తెలిపారు.
‘సినీ పరిశ్రమలో మార్పు రావాలి. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను. తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను నేడు అడగను. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. పవన్ కళ్యాణ్ నాకు ఆదర్శం, నేను ఆయన సూచనలను అనుసరిస్తా. పవన్ కళ్యాణ్ సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదు. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించాం. పవన్ కళ్యాణ్ సూచనలపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చాను’ అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఏపీలోని థియేటర్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి.. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త సినిమాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా.. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే.. తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే వేయకూడదని అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరిగి.. పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు తెరకెక్కించిన సినిమా తమ్ముడు. ఈ చిత్రం జులై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు ట్రైలర్ను లాంచ్ చేశారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!