Dil Raju: నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్!
- నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్
- తమ్ముడు చిత్రానికి టికెట్ ధరలు పెంచము
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు ఆదర్శం
- ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్ చేశారు. తన సినిమాలకు టికెట్ ధరలు పెంచనని, ‘తమ్ముడు’ చిత్రానికి ధరలు పెంచమని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అడగను అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శం అని, తాను పవన్ సూచనలను అనుసరిస్తా అని చెప్పారు. థియేటర్లలో ధరల నియంత్రణ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన సూచనలు ఫాలో అవుతున్నానని పేర్కొన్నారు. ఏపీలో థియేటర్లలో ధరల నియంత్రణకు డిప్యూటీ సీఎం పవన్ తీసుకున్న చర్యల గురించి తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ప్రతిపాదించామని దిల్ రాజు తెలిపారు.
‘సినీ పరిశ్రమలో మార్పు రావాలి. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను. తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను నేడు అడగను. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. పవన్ కళ్యాణ్ నాకు ఆదర్శం, నేను ఆయన సూచనలను అనుసరిస్తా. పవన్ కళ్యాణ్ సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదు. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించాం. పవన్ కళ్యాణ్ సూచనలపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చాను’ అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.
Also Read
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
ఏపీలోని థియేటర్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి.. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త సినిమాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా.. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే.. తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే వేయకూడదని అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరిగి.. పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు తెరకెక్కించిన సినిమా తమ్ముడు. ఈ చిత్రం జులై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు ట్రైలర్ను లాంచ్ చేశారు.
తాజావార్తలు
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!