Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Probe Agency Arrests Jharkhand Ministers Aide After Rs 35 Crore Cash Recovery

Jharkhand: గది నిండా నోట్ల కట్టలే.. జార్ఖండ్ మంత్రి సహాయకుడు అరెస్ట్‌

Published Date :May 7, 2024 , 9:11 am
By Mahesh Jakki
Jharkhand: గది నిండా నోట్ల కట్టలే.. జార్ఖండ్ మంత్రి సహాయకుడు అరెస్ట్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jharkhand: జార్ఖండ్‌లో భారీ మొత్తంలో నగదు రికవరీ కేసులో కీలక చర్యలు తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్, అతని సేవకుడు జహంగీర్ ఆలంలను అరెస్ట్ చేసింది. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నామని, రాత్రిపూట విచారణ అనంతరం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం అరెస్టు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి. సోమవారం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్, అతని ఇంటి పనివాడు జహంగీర్ ఆలం ఇంటిపై ఈడీ దాడి చేసినప్పుడు అక్కడ కరెన్సీ నోట్ల స్టాక్ కనుగొనబడింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో బ్యాంకు ఉద్యోగులను నోట్ల లెక్కింపు యంత్రాలతో పిలిపించారు. ఈ కేసులో మొత్తం 6 చోట్ల సోదాలు జరిగాయి. మొత్తం రూ.35.23 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: PM Modi: మూడో దశలో రికార్డు స్థాయిలో ఓటేయాలి.. ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి

Also Read

  • DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
  • Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
  • DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..

10 వేలు లంచం తీసుకున్న కేసులో..
రూ.10 లంచం కేసులో చీఫ్ ఇంజనీర్ ఇంటిపై గతేడాది ఈడీ దాడులు చేసింది. ఈ సందర్భంగా ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. లంచం డబ్బును మంత్రికి చేరవేసినట్లు చెప్పారు. ఆ తర్వాత తొలిసారిగా జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం పేరు తెరపైకి వచ్చింది. ఈ విచారణలో ఆలంగీర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ నగదు సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి నుంచి రికవరీ చేయబడింది.

ఈ అంశాన్ని లేవనెత్తిన ప్రధాని
కొద్ది రోజుల క్రితం, ప్రధాని మోడీ జార్ఖండ్‌లో ప్రచారం చేస్తున్నప్పుడు అవినీతి అంశాన్ని లేవనెత్తారు. ప్రధాని ర్యాలీ జరిగిన కొన్ని రోజుల తరువాత ఈ చర్య జరిగింది, ఇందులో పెద్ద మొత్తంలో నగదు కనుగొనబడింది. ఈ విషయంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ.. ‘కౌంటింగ్ పూర్తి చేయనివ్వండి, ఈ లెక్కన 50 కోట్లకు చేరుకుంటుంది. జార్ఖండ్ ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయింది.” అని ఆరోపించారు.

ఆలంగీర్ ఆలం ఎవరు?
ఆలంగీర్ ఆలం పాకుర్ అసెంబ్లీ నుండి నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. దీనికి ముందు, అలంగీర్ ఆలం 20 అక్టోబర్ 2006 నుండి 12 డిసెంబర్ 2009 వరకు జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్‌గా కూడా ఉన్నారు. రాజకీయ వారసత్వంగా వచ్చిన ఆలంగీర్ సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించి రాజకీయాల్లోకి వచ్చారు. 2000 సంవత్సరంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

గత ఏడాది డిసెంబర్‌లో కూడా జార్ఖండ్‌లో భారీ మొత్తంలో నగదు రికవరీ అయిందని తెలిసిందే. కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ, వ్యాపారవేత్త ధీరజ్‌ సాహు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ రూ.350 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. దాడిలో దొరికిన నగదు నా మద్యం కంపెనీలకు చెందినదని తెలిపారు. మద్యం వ్యాపారం కేవలం నగదు రూపంలోనే జరుగుతుందని, కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ED
  • Enforcement Directorate
  • Jharkhand
  • Jharkhand Minister Alamgir Alam
  • latest news

తాజావార్తలు

  • DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..

  • Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??

  • Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..

ట్రెండింగ్‌

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions