Jharkhand: గది నిండా నోట్ల కట్టలే.. జార్ఖండ్ మంత్రి సహాయకుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: జార్ఖండ్లో భారీ మొత్తంలో నగదు రికవరీ కేసులో కీలక చర్యలు తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్, అతని సేవకుడు జహంగీర్ ఆలంలను అరెస్ట్ చేసింది. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నామని, రాత్రిపూట విచారణ అనంతరం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం అరెస్టు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి. సోమవారం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్, అతని ఇంటి పనివాడు జహంగీర్ ఆలం ఇంటిపై ఈడీ దాడి చేసినప్పుడు అక్కడ కరెన్సీ నోట్ల స్టాక్ కనుగొనబడింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో బ్యాంకు ఉద్యోగులను నోట్ల లెక్కింపు యంత్రాలతో పిలిపించారు. ఈ కేసులో మొత్తం 6 చోట్ల సోదాలు జరిగాయి. మొత్తం రూ.35.23 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: PM Modi: మూడో దశలో రికార్డు స్థాయిలో ఓటేయాలి.. ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి
Also Read
10 వేలు లంచం తీసుకున్న కేసులో..
రూ.10 లంచం కేసులో చీఫ్ ఇంజనీర్ ఇంటిపై గతేడాది ఈడీ దాడులు చేసింది. ఈ సందర్భంగా ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. లంచం డబ్బును మంత్రికి చేరవేసినట్లు చెప్పారు. ఆ తర్వాత తొలిసారిగా జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం పేరు తెరపైకి వచ్చింది. ఈ విచారణలో ఆలంగీర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ నగదు సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి నుంచి రికవరీ చేయబడింది.
ఈ అంశాన్ని లేవనెత్తిన ప్రధాని
కొద్ది రోజుల క్రితం, ప్రధాని మోడీ జార్ఖండ్లో ప్రచారం చేస్తున్నప్పుడు అవినీతి అంశాన్ని లేవనెత్తారు. ప్రధాని ర్యాలీ జరిగిన కొన్ని రోజుల తరువాత ఈ చర్య జరిగింది, ఇందులో పెద్ద మొత్తంలో నగదు కనుగొనబడింది. ఈ విషయంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కాంగ్రెస్పై విరుచుకుపడుతూ.. ‘కౌంటింగ్ పూర్తి చేయనివ్వండి, ఈ లెక్కన 50 కోట్లకు చేరుకుంటుంది. జార్ఖండ్ ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయింది.” అని ఆరోపించారు.
ఆలంగీర్ ఆలం ఎవరు?
ఆలంగీర్ ఆలం పాకుర్ అసెంబ్లీ నుండి నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. దీనికి ముందు, అలంగీర్ ఆలం 20 అక్టోబర్ 2006 నుండి 12 డిసెంబర్ 2009 వరకు జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్గా కూడా ఉన్నారు. రాజకీయ వారసత్వంగా వచ్చిన ఆలంగీర్ సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించి రాజకీయాల్లోకి వచ్చారు. 2000 సంవత్సరంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
గత ఏడాది డిసెంబర్లో కూడా జార్ఖండ్లో భారీ మొత్తంలో నగదు రికవరీ అయిందని తెలిసిందే. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, వ్యాపారవేత్త ధీరజ్ సాహు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ రూ.350 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. దాడిలో దొరికిన నగదు నా మద్యం కంపెనీలకు చెందినదని తెలిపారు. మద్యం వ్యాపారం కేవలం నగదు రూపంలోనే జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
తాజావార్తలు
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!