Pro Pak Slogans: అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pro Pak Slogans: 2018లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహ్మద్ అక్బర్ లోన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాన్ని లేవనెత్తారు. ఈ పెద్ద వివాదం తర్వాత ఐదేళ్ల తర్వాత, సుప్రీంకోర్టు సోమవారం మహ్మద్ అక్బర్ లోన్ను భారత రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేసి, దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నట్లు లిఖితపూర్వకంగా ప్రమాణం చేయాలని మహ్మద్ అక్బర్ లోన్ను ధర్మాసనం కోరింది. 2018లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించడంతో సుప్రీంకోర్టు చర్యలకు పూనుకుంది.
Also Read: Omar Abdullah: ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేందుకే జమిలి ఎన్నికలు..
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఆర్టికల్ 370 రద్దు ప్రధాన పిటిషనర్ అయి అక్బర్ లోన్ మంగళవారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ విషయాన్ని తెలియజేశారు. బెంచ్ కోరిన అఫిడవిట్ను దాఖలు చేయకపోతే ఆయన తరపున వాదించబోనని సీనియర్ లాయర్ తెలిపారు. అక్బర్ లోన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపిస్తూ, ‘ఆయన లోక్సభ ఎంపీ. అతను భారత పౌరుడు, రాజ్యాంగం సూచించిన విధంగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నట్లు సిబల్ చెప్పారు. అదే సమయంలో దీనికి ఒక రోజు ముందు, కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాన్ని లేవనెత్తినందుకు అక్బర్ లోన్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నట్లు ధర్మాసనానికి తెలిపారు.
Also Read: TMC: ఇండియా కూటమికి ఎలాంటి సంబంధం లేదు.. ఉదయనిధి ‘సనాతన ధర్మ’ వ్యాఖ్యపై తృణమూల్
అక్బర్ లోన్కు రాజ్యాంగం పట్ల విధేయత ఉందని అంగీకరించాలంటే, సభలో నినాదాలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని లా ఆఫీసర్ అన్నారు. సెప్టెంబర్ 1న, కాశ్మీరీ పండిట్ గ్రూప్ అక్బర్ లోన్ వేర్పాటువాద శక్తులకు మద్దతుదారుడని పేర్కొంటూ, అతని అర్హతలను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ‘రూట్స్ ఇన్ కాశ్మీర్’ అనే ఎన్జీవో సుప్రీం కోర్టులో జోక్యానికి దరఖాస్తు చేసింది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!