Priyanka Gandhi: ఆపరేషన్ సిందూర్పై ప్రియాంక గాంధీ ప్రసంగం.. అభినందించడంలో పోటీపడ్డ సభ్యులు!
- లోక్సభలో 'ఆపరేషన్ సిందూర్'పై చర్చ
- లోక్సభలో ప్రియాంక గాంధీ ప్రసంగం
- అభినందించడంలో ఇండియా కూటమి పోటీపడ్డ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi’s speech on Operation Sindoor: లోక్సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యతగా హోంమంత్రి లేదా ఐబీ చీఫ్ లేదా ఇంకెవరన్నా రాజీనామా చేశారా? అని అడిగారు. టీఆర్ఎఫ్ కొత్త సంస్థ ఏం కాదు అని, వరుసగా దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు? అని మండిపడ్డారు. ప్రతిసారీ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు తమ కుటుంబం గురించే మాట్లాడతారని, మీరు బాధ్యతతో ఎప్పుడైనా వ్యవహరించారా? అంటూ బీజేపీ నాయకులను ప్రియాంక గాంధీ నిలదీశారు. లోక్సభలో ప్రియాంక గాంధీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రసంగం అనంతరం ఇండియా కూటమి సభ్యులు ఆమెను అభినందించడంలో పోటీపడ్డారు.
‘ప్రభుత్వం గతం గురించి మాట్లాడుతోంది, నేను వర్తమానం గురించి మాట్లాడుతున్నా. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల వ్యధను పూర్తిగా అర్దం చేసుకునే మాట్లాడుతున్నా. పహల్గాం ఉగ్ర దాడికి బాధ్యత వహించి హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేశారా? చేయలేదే. ప్రతిసారీ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు మా కుటుంబం గురించే మాట్లాడతారు. మీరు బాధ్యతతో ఎప్పుడైనా వ్యవహరించారా?. ఆపరేషన్ సిందూర్ను ప్రతి రాజకీయ పక్షం సమర్ధించింది. అయితే శ్రమ పడింది సైనికులైతే, కీర్తిని సొంతం చేసుకుంది ప్రధాని మోడీ. కీర్తిని సొంతం చేసుకున్నారు, పర్లాలేదు.. మరి బాధ్యత కూడా తీసుకోవాలి కదా. పహల్గాం ఉగ్రదాడిని పసిగట్టలేక లేకపోయారు, ఇది నిఘావర్గాల వైఫల్యం కాదా?’ అని ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
Also Read
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
‘ప్రతిరోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పర్యాటకులు పహల్గాం వస్తున్నప్పుడు ఒక్క సైనికుడైనా రక్షణ కోసం అక్కడ ఉన్నారా?. పర్యాటకులకు సాయుధ బలగాలు రక్షణ కల్పించారా?. ఇది వైఫల్యం కాదా?. బాధ్యత ఎవరు వహించాలి. దేశ ప్రధానిది బాధ్యత కాదా?, హోమ్ మంత్రికి బాధ్యత లేదా?’ అని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లు ప్రియాంక గాంధీ సభాముఖంగా చదివారు. మృతి చెందిన ప్రతి వ్యక్తి పేరు చదవుతుంటే.. హిందూ అంటూ అధికార పక్ష సభ్యులు, భారతీయులు అంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరవీరులుగా ప్రియాంక గాంధీ అభివర్ణించారు. ప్రసంగం పూర్తవగానే ఇండియా కూటమి పక్షాల సభ్యులు ప్రియాంక గాంధీ వద్దకు వచ్చి అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!