Priyanka Gandhi: ఆపరేషన్ సిందూర్పై ప్రియాంక గాంధీ ప్రసంగం.. అభినందించడంలో పోటీపడ్డ సభ్యులు!
- లోక్సభలో 'ఆపరేషన్ సిందూర్'పై చర్చ
- లోక్సభలో ప్రియాంక గాంధీ ప్రసంగం
- అభినందించడంలో ఇండియా కూటమి పోటీపడ్డ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi’s speech on Operation Sindoor: లోక్సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యతగా హోంమంత్రి లేదా ఐబీ చీఫ్ లేదా ఇంకెవరన్నా రాజీనామా చేశారా? అని అడిగారు. టీఆర్ఎఫ్ కొత్త సంస్థ ఏం కాదు అని, వరుసగా దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు? అని మండిపడ్డారు. ప్రతిసారీ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు తమ కుటుంబం గురించే మాట్లాడతారని, మీరు బాధ్యతతో ఎప్పుడైనా వ్యవహరించారా? అంటూ బీజేపీ నాయకులను ప్రియాంక గాంధీ నిలదీశారు. లోక్సభలో ప్రియాంక గాంధీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రసంగం అనంతరం ఇండియా కూటమి సభ్యులు ఆమెను అభినందించడంలో పోటీపడ్డారు.
‘ప్రభుత్వం గతం గురించి మాట్లాడుతోంది, నేను వర్తమానం గురించి మాట్లాడుతున్నా. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల వ్యధను పూర్తిగా అర్దం చేసుకునే మాట్లాడుతున్నా. పహల్గాం ఉగ్ర దాడికి బాధ్యత వహించి హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేశారా? చేయలేదే. ప్రతిసారీ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు మా కుటుంబం గురించే మాట్లాడతారు. మీరు బాధ్యతతో ఎప్పుడైనా వ్యవహరించారా?. ఆపరేషన్ సిందూర్ను ప్రతి రాజకీయ పక్షం సమర్ధించింది. అయితే శ్రమ పడింది సైనికులైతే, కీర్తిని సొంతం చేసుకుంది ప్రధాని మోడీ. కీర్తిని సొంతం చేసుకున్నారు, పర్లాలేదు.. మరి బాధ్యత కూడా తీసుకోవాలి కదా. పహల్గాం ఉగ్రదాడిని పసిగట్టలేక లేకపోయారు, ఇది నిఘావర్గాల వైఫల్యం కాదా?’ అని ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
Also Read
- TG TET 2026 Results: ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
‘ప్రతిరోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పర్యాటకులు పహల్గాం వస్తున్నప్పుడు ఒక్క సైనికుడైనా రక్షణ కోసం అక్కడ ఉన్నారా?. పర్యాటకులకు సాయుధ బలగాలు రక్షణ కల్పించారా?. ఇది వైఫల్యం కాదా?. బాధ్యత ఎవరు వహించాలి. దేశ ప్రధానిది బాధ్యత కాదా?, హోమ్ మంత్రికి బాధ్యత లేదా?’ అని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లు ప్రియాంక గాంధీ సభాముఖంగా చదివారు. మృతి చెందిన ప్రతి వ్యక్తి పేరు చదవుతుంటే.. హిందూ అంటూ అధికార పక్ష సభ్యులు, భారతీయులు అంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరవీరులుగా ప్రియాంక గాంధీ అభివర్ణించారు. ప్రసంగం పూర్తవగానే ఇండియా కూటమి పక్షాల సభ్యులు ప్రియాంక గాంధీ వద్దకు వచ్చి అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
-
TG TET 2026 Results: ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
Tumbbad 2: హారర్ ప్రపంచంలోకి ఆలియా భట్.. ‘తుంబాడ్ 2’లో కీలక పాత్ర ఖరారు!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!