Prithvi Shaw: పృథ్వీ షాకు ఏమైంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithvi Shaw: భారత జట్టు ఓపెనర్ పృథ్వీ షా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడు. పృథ్వీ షా ఇటీవల ఓ మోడల్తో వివాదం కారణంగా వెలుగులోకి వచ్చింది.అయితే ఈ వివాదం చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ.. పృథ్వీ దీనిపై ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు. చిన్న వయసులోనే భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. మళ్లీ టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతను న్యూజిలాండ్తో సిరీస్లో జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ ప్లేయింగ్ ఎలెవెన్లో ఆడే అవకాశం రాలేదు.
కాగా, కొద్ది రోజుల క్రితం పృథ్వీ షా భారత జట్టులో అవకాశం రాకపోవడంపై స్పందించాడు. టీమ్ ఇండియాకు ఆడటం తనకు చాలా ముఖ్యం. తను ఈ టీమ్ ఇండియాతో ఏమి సాధించాలనుకుంటున్నాను అనే జాబితాను తయారు చేసాను అని షా అన్నారు. జట్టులో అవకాశం కోసం తాను ఎదురు చూస్తున్నానని అతను చెప్పాడు.ట్వంటీ 20కి తిరిగి వచ్చిన తర్వాత, చాలా బాగున్నాను అని పృథ్వి షా వెల్లడించారు. కానీ.. నాకు జట్టులో ఆడే అవకాశం రాలేదు.. కానీ పునరాగమనం చాలా ముఖ్యమంటు షా తెలిపారు. ఇప్పుడు తన ఇన్ ష్టా గ్రామ్ అకౌంట్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టి అభిమానుల దృష్టిని పృథ్వీ షా ఆకర్షించాడు.
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
Read Also: Shubman Gill: రష్మిక.. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు
ప్రస్తుతం రాబోయే ఐపీఎల్ సీజన్కు సిద్ధమవుతున్న పృథ్వీ షా ఎమోషనల్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఉంచారు. స్టోరీ ద్వారా పృథ్వీ మాట్లాడుతూ, కొంతమంది నిన్ను ప్రేమిస్తారు.. వారు మిమ్మల్ని ఉపయోగించుకునేంత వరకు.. వారి ప్రయోజనాలు ఎక్కడ ముగుస్తుందో అక్కడ వారి విధేయత ముగుస్తుంది.. కొంతమంది అవసరాన్ని బట్టి మాత్రమే ప్రేమిస్తారని పృథ్వీ షా చెప్పారు.
నిజానికి పేలవమైన ఫామ్, నిషేధిత పదార్థాల వినియోగం కారణంగా పృథ్వీ షా చాలా కాలం పాటు భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మరియు రంజీ ట్రోఫీలలో గట్టి ప్రదర్శనతో అతను తిరిగి జట్టులోకి వచ్చాడు. పృథ్వీ షా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 363, రంజీ ట్రోఫీలో 379 పరుగులు చేశాడు. టీమిండియా జట్టులో తనకు స్థానంలో లభించకపోవడంతోనే ఈ పోస్ట్ చేసినట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా పృథ్వీ షాను తిరిగి భారత జట్టులో ఆడించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!