Prithvi Shaw: పృథ్వీ షాకు ఏమైంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithvi Shaw: భారత జట్టు ఓపెనర్ పృథ్వీ షా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడు. పృథ్వీ షా ఇటీవల ఓ మోడల్తో వివాదం కారణంగా వెలుగులోకి వచ్చింది.అయితే ఈ వివాదం చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ.. పృథ్వీ దీనిపై ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు. చిన్న వయసులోనే భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. మళ్లీ టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతను న్యూజిలాండ్తో సిరీస్లో జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ ప్లేయింగ్ ఎలెవెన్లో ఆడే అవకాశం రాలేదు.
కాగా, కొద్ది రోజుల క్రితం పృథ్వీ షా భారత జట్టులో అవకాశం రాకపోవడంపై స్పందించాడు. టీమ్ ఇండియాకు ఆడటం తనకు చాలా ముఖ్యం. తను ఈ టీమ్ ఇండియాతో ఏమి సాధించాలనుకుంటున్నాను అనే జాబితాను తయారు చేసాను అని షా అన్నారు. జట్టులో అవకాశం కోసం తాను ఎదురు చూస్తున్నానని అతను చెప్పాడు.ట్వంటీ 20కి తిరిగి వచ్చిన తర్వాత, చాలా బాగున్నాను అని పృథ్వి షా వెల్లడించారు. కానీ.. నాకు జట్టులో ఆడే అవకాశం రాలేదు.. కానీ పునరాగమనం చాలా ముఖ్యమంటు షా తెలిపారు. ఇప్పుడు తన ఇన్ ష్టా గ్రామ్ అకౌంట్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టి అభిమానుల దృష్టిని పృథ్వీ షా ఆకర్షించాడు.
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
Read Also: Shubman Gill: రష్మిక.. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు
ప్రస్తుతం రాబోయే ఐపీఎల్ సీజన్కు సిద్ధమవుతున్న పృథ్వీ షా ఎమోషనల్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఉంచారు. స్టోరీ ద్వారా పృథ్వీ మాట్లాడుతూ, కొంతమంది నిన్ను ప్రేమిస్తారు.. వారు మిమ్మల్ని ఉపయోగించుకునేంత వరకు.. వారి ప్రయోజనాలు ఎక్కడ ముగుస్తుందో అక్కడ వారి విధేయత ముగుస్తుంది.. కొంతమంది అవసరాన్ని బట్టి మాత్రమే ప్రేమిస్తారని పృథ్వీ షా చెప్పారు.
నిజానికి పేలవమైన ఫామ్, నిషేధిత పదార్థాల వినియోగం కారణంగా పృథ్వీ షా చాలా కాలం పాటు భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మరియు రంజీ ట్రోఫీలలో గట్టి ప్రదర్శనతో అతను తిరిగి జట్టులోకి వచ్చాడు. పృథ్వీ షా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 363, రంజీ ట్రోఫీలో 379 పరుగులు చేశాడు. టీమిండియా జట్టులో తనకు స్థానంలో లభించకపోవడంతోనే ఈ పోస్ట్ చేసినట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా పృథ్వీ షాను తిరిగి భారత జట్టులో ఆడించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!