PM Modi: నా కుటుంబం కోసమే రోజుకు 12 గంటలు పని చేస్తున్నా.. మోడీ కీలక వ్యాఖ్యలు
- కువైట్లోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును సందర్శించిన మోడీ
- భారతీయ కార్మికులతో ముచ్చట్లు
- కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ కువైట్లోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును సందర్శించారు. అక్కడున్న భారతీయ కార్మికులతో సంభాషించారు. ఈ సందర్భంగా, భారతదేశంలో చౌకైన డేటా (ఇంటర్నెట్) ఉందన్నారు. ప్రపంచంలో ఎవరితోనైనా ఆన్లైన్లో మాట్లాడాలనుకుంటే, ఖర్చు చాలా తక్కువ అని ప్రధాని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు కూడా తక్కువే అని తెలిపారు.
నేను కూడా 12 గంటలు పని చేస్తాను – ప్రధాని మోడీ
“నేను అభివృద్ధి చెందిన భారతదేశం 2047 గురించి మాట్లాడుతున్నాను. అప్పటి వరకు సుదూర ప్రాంతాల నుంచి పని చేయడానికి వచ్చిన మీరు కూడా మీ గ్రామంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా నిర్మించాలో ఆలోచిస్తారు. ఈ ఆకాంక్షే నా దేశానికి బలం. మన రైతులు ఎంత కష్టపడుతున్నారో రోజంతా ఆలోచిస్తూ ఉంటాను. పొలాల్లో మన కూలీలు ఎంత కష్టపడి పని చేస్తారు. వీళ్లంతా 10 గంటలు పని చేస్తే నేను కూడా 11 గంటలు పని చేయాలి అనిపిస్తుంది. వాళ్ళు 11 గంటలు పనిచేస్తే నేను కూడా 12 గంటలు పని చేయాలని ఉంటుంది. రెండవది మీరు మీ కుటుంబం కోసం కష్టపడుతున్నారా లేదా? నేను కూడా నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. మా కుటుంబంలో 140 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి నేను కొంచెం ఎక్కువ కష్టపడి పని చేయాలి.” అని ప్రధాని తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
అభివృద్ధి అంటే మంచి రోడ్లు, మంచి విమానాశ్రయాలు కాదు..
“నాకు అభివృద్ధి అంటే మంచి రోడ్లు, మంచి విమానాశ్రయాలు, మంచి రైల్వే స్టేషన్లు మాత్రమే కాదు. నిరుపేదలకు కూడా వారి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని కోరుకుంటున్నా. 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడమే మా లక్ష్యం. పేదలకు శాశ్వత ఇళ్లు ఉండాలి. ఇప్పటి వరకు 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చాం. అందులో కనీసం15-16 కోట్ల మంది అందులో నివసిస్తారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు కృషి చేస్తున్నాను.” అని మోడీ వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!