PM Modi: నా కుటుంబం కోసమే రోజుకు 12 గంటలు పని చేస్తున్నా.. మోడీ కీలక వ్యాఖ్యలు
- కువైట్లోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును సందర్శించిన మోడీ
- భారతీయ కార్మికులతో ముచ్చట్లు
- కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ కువైట్లోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును సందర్శించారు. అక్కడున్న భారతీయ కార్మికులతో సంభాషించారు. ఈ సందర్భంగా, భారతదేశంలో చౌకైన డేటా (ఇంటర్నెట్) ఉందన్నారు. ప్రపంచంలో ఎవరితోనైనా ఆన్లైన్లో మాట్లాడాలనుకుంటే, ఖర్చు చాలా తక్కువ అని ప్రధాని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు కూడా తక్కువే అని తెలిపారు.
నేను కూడా 12 గంటలు పని చేస్తాను – ప్రధాని మోడీ
“నేను అభివృద్ధి చెందిన భారతదేశం 2047 గురించి మాట్లాడుతున్నాను. అప్పటి వరకు సుదూర ప్రాంతాల నుంచి పని చేయడానికి వచ్చిన మీరు కూడా మీ గ్రామంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా నిర్మించాలో ఆలోచిస్తారు. ఈ ఆకాంక్షే నా దేశానికి బలం. మన రైతులు ఎంత కష్టపడుతున్నారో రోజంతా ఆలోచిస్తూ ఉంటాను. పొలాల్లో మన కూలీలు ఎంత కష్టపడి పని చేస్తారు. వీళ్లంతా 10 గంటలు పని చేస్తే నేను కూడా 11 గంటలు పని చేయాలి అనిపిస్తుంది. వాళ్ళు 11 గంటలు పనిచేస్తే నేను కూడా 12 గంటలు పని చేయాలని ఉంటుంది. రెండవది మీరు మీ కుటుంబం కోసం కష్టపడుతున్నారా లేదా? నేను కూడా నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. మా కుటుంబంలో 140 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి నేను కొంచెం ఎక్కువ కష్టపడి పని చేయాలి.” అని ప్రధాని తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
- LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
అభివృద్ధి అంటే మంచి రోడ్లు, మంచి విమానాశ్రయాలు కాదు..
“నాకు అభివృద్ధి అంటే మంచి రోడ్లు, మంచి విమానాశ్రయాలు, మంచి రైల్వే స్టేషన్లు మాత్రమే కాదు. నిరుపేదలకు కూడా వారి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని కోరుకుంటున్నా. 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడమే మా లక్ష్యం. పేదలకు శాశ్వత ఇళ్లు ఉండాలి. ఇప్పటి వరకు 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చాం. అందులో కనీసం15-16 కోట్ల మంది అందులో నివసిస్తారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు కృషి చేస్తున్నాను.” అని మోడీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!