సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని చెప్పుకొచ్చారు. ఓ జాతీయ మీడియాతో మోడీ మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు ముస్లిం మహిళల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని.. ముస్లిం సోదరీమణులంతా భావించారని ప్రధాని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Daryl Mitchell: ఏంటి బ్రో అంత పనిచేసావ్.. దెబ్బకు అభిమాని ఫోన్ దభేల్..
ముస్లింలను వ్యతిరేకంచడం బీజేపీ విధానం కాదన్నారు. ముస్లిం వ్యతిరేకులు అంటూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నారని చెప్పారు. మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి.. తాము వారికి స్నేహితులమంటూ విపక్షాలు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాయని వ్యా్ఖ్యానించారు. కానీ ముస్లిం సమాజం చైతన్యవంతంగా మారిందన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు వారి ఆందోళనపై తాను నిజాయతీగా ఉన్నానని ముస్లిం సోదరీమణులంతా భావించారని తెలిపారు. ఆయుష్మాన్ కార్డులు ఇచ్చినప్పుడు, కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చినప్పుడు వారు అలాగే భావించారన్నారు. తాను ఎవరిపైనా వివక్ష చూపడం లేదని వారు అర్థం చేసుకున్నారని.. విపక్షాల అబద్ధాలు బయటపడ్డాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Chandrabose – RP: చంద్రబోస్, ఆర్పీలకి కొత్త బిరుదులు.. ఏమంటే?
ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశ సంపదను ముస్లింలకు పంచుతామని అంటోందని అన్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మోడీ క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. ఇక నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: Supriya Sule: ఓటు వేసి అజిత్ పవార్ తల్లి ఆశీర్వాదం తీసుకున్న సుప్రియా