Yogi Adityanath: తాజ్మహాల్ కట్టిన కూలీల చేతులు నరికేశారు.. రామమందిరం కట్టిన వారికి గౌరవం
- రామమందిర నిర్మాణ కార్మికులకు గౌరవం
- తాజ్మహాల్ నిర్మించిన వారి చేతులు నరికేశారు
- డబ్ల్యూహెచ్ఈఎఫ్ సదస్సులో సీఎం యోగి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ మందిర నిర్మాణంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను ప్రధాని నరేంద్ర మోడీ గౌరవించారని.. కానీ తాజ్ మహల్ కోసం పనిచేసిన కార్మికుల చేతులు నరికేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో కార్మిక శక్తికి ఉన్న గౌరవాన్ని అభినందిస్తూ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలో జరిగిన వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూహెచ్ఈఎఫ్) వార్షిక సదస్సులో యూపీ ముఖ్యమంత్రి ప్రసంగించారు.
READ MORE: TTD Update: టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం!
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
“జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ రామమందిరాన్ని నిర్మించిన కార్మికులను సన్మానించడం మీరు చూశారు. ప్రధానమంత్రి వారిపై పూల వర్షం కురిపించారు. మరోవైపు తాజ్మహల్ను నిర్మించిన కార్మికుల చేతులు నరికే పరిస్థితిని కూడా గమనించాలి. వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న చాలా మంది కార్మికుల చేతులు కూడా తెగిపోయాయి. దీని వల్ల ఒక సంప్రదాయం, వారసత్వం ధ్వంసమైపోయింది. గతంలో లాగా కాకుండా ప్రస్తుతం భారతదేశం శ్రామిక శక్తిని గౌరవిస్తోంది. శ్రామికులకు అన్ని రకాల భద్రతలను కల్పిస్తోంది.” అని సీఎం యోగి వ్యాఖ్యానించారు.
READ MORE:Amit Shah: అదానీ లంచం ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన అమిత్ షా..
‘ఐడెంటిటీ క్రైసిస్’ నుంచి భారత్ను ప్రధాని మోడీ బయటకు తీసుకొచ్చారని సీఎం కొనియాడారు. సంభాల్లో గుడి- మాసీద్ వివాదంపై సీఎం స్పందించారు. నేడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, పెంచుతున్న వారు తమ వారసత్వం అని చెప్పుకుంటారన్నారు. సనాతన ధర్మం భారత్లో ఆచరిస్తున్నప్పుడు ఇంకా ఆ మతం(ఇస్లాం) పుట్టలేదన్నారు. ఇదిలా ఉండగా… ‘విశ్వ హిందూ ఎకనామిక్ ఫోరమ్’ డిసెంబర్ 13న ముంబైలోని బీకేసీలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. డిసెంబర్ 15 వరకు కొనసాగుతుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?