Mahakumbh 2025 : ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా ప్రమాదం నన్ను బాధించింది.. ఘటనపై ప్రధాని విచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahakumbh 2025 : ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా బాధాకరం అని ఆయన రాశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఇక్కడి భక్తులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ప్రధాని మోదీ తన పోస్ట్లో రాశారు. బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించడంలో స్థానిక యంత్రాంగం నిమగ్నమై ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో నేను ముఖ్యమంత్రి యోగిజీతో స్వయంగా మాట్లాడాను. నేను రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదిస్తూ ఉంటానని తెలిపారు.
Read Also:Vasi Zakariya: పోలీసుల అదుపులో ఖలీఫా సంస్థ జాతీయ అధ్యక్షుడు జకర్య
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
సీఎం యోగికి ప్రధాని 4 సార్లు ఫోన్
ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ప్రధాని మోడీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఒక్కొక్కటిగా నాలుగుసార్లు ఫోన్ చేశారు. భద్రతా ఏర్పాట్ల గురించి, గాయపడిన వారందరి గురించి ప్రధాని మోదీ ముఖ్యమంత్రి యోగి నుండి ఫోన్లో సమాచారం తీసుకున్నారు. గాయపడినవారికి సరైన చికిత్స గురించి సిఎం యోగి మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం యోగి పోలీసు యంత్రాంగానికి ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. గంగా నదిలోని ఏ ఘాట్లోనైనా ప్రజలు సురక్షితంగా స్నానం చేయాలని అన్నారు. పుకార్లను పట్టించుకోవద్దని సూచించారు.
प्रयागराज महाकुंभ में हुआ हादसा अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं ने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा हुआ है। इस सिलसिले में मैंने…
— Narendra Modi (@narendramodi) January 29, 2025
Read Also:Sanjana : డైరెక్టర్ గా మారిన హీరోయిన్.. మొదటి సినిమా ఆ హీరోతోనే
మరోవైపు, భక్తుల తరలింపు ఏర్పాట్లకు సంబంధించి ప్రధాని మోదీ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో వివరంగా మాట్లాడారు. రైల్వే మంత్రి కూడా రైల్వే ఏర్పాట్ల గురించి పూర్తి సమాచారాన్ని ప్రధానమంత్రికి అందించారు. భక్తుల రాకపోకల కోసం రైళ్ల సంఖ్యను పెంచినట్లు రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రయాగ్రాజ్ మహా కుంభ్లో అకస్మాత్తుగా జనసమూహం పెరగడం వల్ల రాత్రి 1 నుంచి 2 గంటల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కొంతమంది మరణించగా, చాలా మంది గాయపడినట్లు సమాచారం. చాలా మంది తమ కుటుంబాల నుండి విడిపోయారు. దేశం నలుమూలల నుండి భక్తులు మహా కుంభమేళాకు తరలివచ్చారు. ఈరోజు మౌని అమావాస్య, రాజ స్నానం కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభలో ఇప్పటివరకు 20 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారు. బుధవారం 10 కోట్ల మంది వస్తారని అంచనా.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!