Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
- మధ్యతరగతికి మరో షాక్..
- ఆగస్టు 1 నుంచి ధరల మోత..
- నిత్యావసర వస్తువుల నుంచి కార్ల వరకు ధరల పెంపు..
- టీ, సబ్బు, టీవీ, కార్లు అన్నీ ఖరీదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Price Hike from August 1: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో ఇప్పటికే చాలా వస్తువుల ధరలు పెరిగాయి.. ఇక ఆగస్టు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు మరోసారి ద్రవ్యోల్బణం షాక్ ఇవ్వనుంది. నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్, కార్ల వరకు పలు ఉత్పత్తుల ధరలు పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్పై మరింత భారం పడే అవకాశం ఉంది… మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఎఫ్ఎంసీజీ (FMCG) ఉత్పత్తుల ధరలు 6 నుంచి 8 శాతం వరకు పెరగవచ్చు. ముఖ్యంగా టీ, హెయిర్ ఆయిల్, సబ్బులు, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరో ఆర్థిక భారం కానుంది.
ఇక, ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ధరల పెరుగుదల కనిపించనుంది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్ల ధరలు 4 నుంచి 6 శాతం వరకు పెరగవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో మెమరీ చిప్ల ధరలు భారీగా పెరగడంతో స్మార్ట్ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. ఆటోమొబైల్ రంగంలోనూ ధరల పెంపు తప్పదని కంపెనీలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ముడిసరుకుల ధరలు పెరగడంతో తయారీ వ్యయం అధికమైందని పేర్కొంటూ మారుతి సుజుకి ఆగస్టు నుంచి కొన్ని మోడళ్లపై రూ.30,000 వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. హోండా కార్స్, మెర్సిడెస్-బెంజ్ వంటి కంపెనీలు కూడా త్వరలోనే ధరలను సవరించే అవకాశం ఉంది.
Also Read
- Gold Loan Demand: గోల్డ్ లోన్ల జోరు.. మేలో కొత్త రికార్డు.. ఆర్బీఐ వార్నింగ్..
- Income Tax Return 2026: మరో రెండు రోజులే గడువు.. ఆలస్యమైతే రూ.5,000 వరకు జరిమానా.. ఇతర ఇబ్బందులు తప్పవు..!
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు ప్రపంచ మార్కెట్ పరిస్థితులేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు, పామాయిల్ ధరల పెరుగుదల, ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చులు అధికమవడం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీశాయి. సముద్ర రవాణా వ్యయం పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువలో హెచ్చుతగ్గులు కూడా దిగుమతి ఖర్చులను పెంచుతున్నాయి.
కంపెనీలు ఒకేసారి కాకుండా దశలవారీగా ధరలు పెంచనున్నట్లు తెలిపాయి. మొదట ప్రీమియం ఉత్పత్తులపై ధరలు పెంచి, తర్వాత చిన్న ప్యాకేజీల ధరలను సవరించే అవకాశం ఉంది. జూన్ త్రైమాసికంలో నష్టాలను పూర్తిగా వినియోగదారులపై మోపలేదని, మిగిలిన భారాన్ని సెప్టెంబర్ త్రైమాసికంలో మరో 2 నుంచి 5 శాతం వరకు ధరల పెంపు ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వస్త్ర కంపెనీలు కూడా కొత్త సీజన్ దుస్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని, జీడీపీ వృద్ధి రేటుపైనా ప్రభావం పడొచ్చని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పరిమిత ఆదాయంతో జీవిస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు ఉదయం టీ నుంచి కొత్త కారు కొనుగోలు వరకు ప్రతి ఖర్చు పెరగడంతో రాబోయే పండుగ సీజన్లో బడ్జెట్ను సమతుల్యం చేయడం పెద్ద సవాలుగా మారనుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష.. సిక్సర్లు కొట్టడం కాదు.. ఇక నిలబడి ఆడాలి!
-
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
-
August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
-
MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!