Indian UPI In Maldives: మాల్దీవులలో ఇకపై ఇండియన్ యూపీఐ.. మహమ్మద్ ముయిజ్జూ కీలక నిర్ణయం
- మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ క్యాబినెట్ సిఫార్సుపై
- భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)ని ప్రారంభించాలని నిర్ణయం.
- ఆగస్టులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవుల పర్యటన సందర్భంగా ఒప్పందం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian UPI In Maldives: మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ క్యాబినెట్ సిఫార్సుపై భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)ని ప్రారంభించాలని నిర్ణయించారు. మాల్దీవుల్లో UPIని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మహమ్మద్ ముయిజ్జు ఆదివారం కోరారు. ముయిజు నిర్ణయం గురించి సమాచారం ఇస్తూ.. మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. దీని వల్ల ఆర్థిక చేరిక, ఆర్థిక లావాదేవీల్లో సామర్థ్యం ఇంకా డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Read Also: Haryana Cabinet portfolios: మంత్రుల పోర్ట్ఫోలియో కేటాయింపు.. ఎవరెవరికి ఏఏ శాఖలు కేటాయించారంటే
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
మాల్దీవులలో UPIని ప్రారంభించేందుకు ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు ముయిజు ప్రకటించారు. మాల్దీవుల బ్యాంకులు, టెలికమ్యూనికేషన్ కంపెనీలు, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు ఇంకా ఫిన్టెక్ కంపెనీలను కూడా ఈ కన్సార్టియంలో చేర్చాలని ఆయన సూచించారు. మొహమ్మద్ ముయిజ్జు ట్రేడెనెట్ మాల్దీవులను కన్సార్టియంను ప్రధాన ఏజెన్సీగా నియమించారు. ఈ ఏడాది ఆగస్టులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవుల పర్యటన సందర్భంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్కు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. మాల్దీవుల్లో డిజిటల్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ట్రేడ్ ఆఫ్ మాల్దీవుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
Read Also: Jammu Kashmir: భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదిని హతమార్చిన ఇండియన్ ఆర్మీ
ఈ ఒప్పందం ప్రకారం, మాల్దీవుల ప్రజలు కూడా భారతదేశంలో వలె UPI ద్వారా చెల్లింపులు చేయగలరు. మాల్దీవులలో భారతదేశం సంబంధించిన UPIని ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని మహమ్మద్ ముయిజ్జూ ప్రకటించకముందే.. ఆ దేశ జాతీయ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ (BML) కూడా భారతదేశానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. భారతదేశంలోని రూపే కార్డ్ ఇప్పుడు దాని ATMలు, POS మెషీన్లలో అంగీకరించబడుతుందని BML ఈ నెల అక్టోబర్ 7న ప్రకటించింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!