Rajkot game zone: డీఎన్ఏ టెస్ట్ రిపోర్టు.. గేమ్ జోన్ యజమాని ఏమయ్యాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం గుజరాత్లోని రాజ్కోట్లో జరిగిన ఘోరం కళ్లముందు ఇంకా మెదిలాడుతోంది. గేమ్ జోన్ తగలబడి దాదాపు పిల్లలతో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే పలువురిని గుర్తుపట్టకపోవడంతో పోలీసులు డీఎన్ఏ టెస్టులు నిర్వహించారు. దీంతో పలువురి డీఎన్ఏ టెస్టులు రావడంతో కీలక విషయం బయటపడింది. రాజ్కోట్ గేమ్ జోన్ సహ యజమాని ప్రకాష్ హిరాన్ అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహుతైనట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: Liquor Truck Accident: డ్రైవర్ సహాయం కోసం ఎదురు చూస్తుంటే.. మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్తున్న ప్రజలు..
Also Read
- Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్పై ముస్లిం మతగురువు ఆగ్రహం
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
- India-Iran: హార్ముజ్లో భారతీయుడి మృతిపై భారత్ సీరియస్.. ఇరాన్ రాయబారికి సమన్లు
రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్ యజమానులలో ఒకరైన ప్రకాష్ హిరాన్ గత వారం గేమింగ్ సెంటర్లోనే ఉన్నారు. అగ్నికీలలు చెలరేగి అగ్నిప్రమాదంలో మరణించినట్లు ధృవీకరించారు. ఈ దుర్ఘటనలో చిన్నారులు సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా ప్రకాష్ హిరాన్ ఎవరనే విషయాన్ని అధికారులు నిర్ధారించారు. సంఘటనా స్థలంలో లభించిన అవశేషాల నుంచి తీసిన నమూనాలు ప్రకాష్ తల్లి డీఎన్ఎతో సరిపోలడంతో అతని దురదృష్టవశాత్తు మరణించినట్లు నిర్ధారించారు.
ప్రకాష్ హిరాన్ అత్యంత లాభదాయకమైన TRP గేమ్ జోన్లో ప్రధాన వాటాదారు. అగ్నిప్రమాదం జరిగినప్పటి నుంచి CCTV ఫుటేజ్ సంఘటనా స్థలంలో ప్రకాష్ను గుర్తించారు. ప్రమాద సమయంలో అతను అక్కడే ఉన్నారనే సాక్ష్యాన్ని బలపరిచారు. ప్రకాష్ సోదరుడు జితేంద్ర హిరాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం తర్వాత ప్రకాష్తో ఎటువంటి సంబంధాలు లేదని, అన్ని ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయని తెలిపారు. ఇక అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రకాష్ కారు కూడా అక్కడే ఉన్నట్లుగా గుర్తించారు.
గేమ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి హిరాన్తో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేస్వే ఎంటర్ప్రైజెస్కు చెందిన ఐదుగురు భాగస్వాములతో కలిసి టీఆర్పీ గేమ్ జోన్ను నడిపిన ధవల్ కార్పొరేషన్ యాజమాన్యం ధవల్ ఠక్కర్ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో రేస్వే ఎంటర్ప్రైజెస్లో భాగస్వాములైన యువరాజ్సింగ్ సోలంకి, రాహుల్ రాథోడ్, గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Gun On Road: నడిరోడ్డుపై తుపాకీతో వ్యక్తిని కొట్టిన ఆ పార్టీ నాయకుడు.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్పై ముస్లిం మతగురువు ఆగ్రహం
-
AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
-
Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు
-
Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
-
RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!