Rajkot game zone: డీఎన్ఏ టెస్ట్ రిపోర్టు.. గేమ్ జోన్ యజమాని ఏమయ్యాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం గుజరాత్లోని రాజ్కోట్లో జరిగిన ఘోరం కళ్లముందు ఇంకా మెదిలాడుతోంది. గేమ్ జోన్ తగలబడి దాదాపు పిల్లలతో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే పలువురిని గుర్తుపట్టకపోవడంతో పోలీసులు డీఎన్ఏ టెస్టులు నిర్వహించారు. దీంతో పలువురి డీఎన్ఏ టెస్టులు రావడంతో కీలక విషయం బయటపడింది. రాజ్కోట్ గేమ్ జోన్ సహ యజమాని ప్రకాష్ హిరాన్ అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహుతైనట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: Liquor Truck Accident: డ్రైవర్ సహాయం కోసం ఎదురు చూస్తుంటే.. మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్తున్న ప్రజలు..
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్ యజమానులలో ఒకరైన ప్రకాష్ హిరాన్ గత వారం గేమింగ్ సెంటర్లోనే ఉన్నారు. అగ్నికీలలు చెలరేగి అగ్నిప్రమాదంలో మరణించినట్లు ధృవీకరించారు. ఈ దుర్ఘటనలో చిన్నారులు సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా ప్రకాష్ హిరాన్ ఎవరనే విషయాన్ని అధికారులు నిర్ధారించారు. సంఘటనా స్థలంలో లభించిన అవశేషాల నుంచి తీసిన నమూనాలు ప్రకాష్ తల్లి డీఎన్ఎతో సరిపోలడంతో అతని దురదృష్టవశాత్తు మరణించినట్లు నిర్ధారించారు.
ప్రకాష్ హిరాన్ అత్యంత లాభదాయకమైన TRP గేమ్ జోన్లో ప్రధాన వాటాదారు. అగ్నిప్రమాదం జరిగినప్పటి నుంచి CCTV ఫుటేజ్ సంఘటనా స్థలంలో ప్రకాష్ను గుర్తించారు. ప్రమాద సమయంలో అతను అక్కడే ఉన్నారనే సాక్ష్యాన్ని బలపరిచారు. ప్రకాష్ సోదరుడు జితేంద్ర హిరాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం తర్వాత ప్రకాష్తో ఎటువంటి సంబంధాలు లేదని, అన్ని ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయని తెలిపారు. ఇక అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రకాష్ కారు కూడా అక్కడే ఉన్నట్లుగా గుర్తించారు.
గేమ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి హిరాన్తో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేస్వే ఎంటర్ప్రైజెస్కు చెందిన ఐదుగురు భాగస్వాములతో కలిసి టీఆర్పీ గేమ్ జోన్ను నడిపిన ధవల్ కార్పొరేషన్ యాజమాన్యం ధవల్ ఠక్కర్ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో రేస్వే ఎంటర్ప్రైజెస్లో భాగస్వాములైన యువరాజ్సింగ్ సోలంకి, రాహుల్ రాథోడ్, గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Gun On Road: నడిరోడ్డుపై తుపాకీతో వ్యక్తిని కొట్టిన ఆ పార్టీ నాయకుడు.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
-
Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!