Rajkot game zone: డీఎన్ఏ టెస్ట్ రిపోర్టు.. గేమ్ జోన్ యజమాని ఏమయ్యాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం గుజరాత్లోని రాజ్కోట్లో జరిగిన ఘోరం కళ్లముందు ఇంకా మెదిలాడుతోంది. గేమ్ జోన్ తగలబడి దాదాపు పిల్లలతో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే పలువురిని గుర్తుపట్టకపోవడంతో పోలీసులు డీఎన్ఏ టెస్టులు నిర్వహించారు. దీంతో పలువురి డీఎన్ఏ టెస్టులు రావడంతో కీలక విషయం బయటపడింది. రాజ్కోట్ గేమ్ జోన్ సహ యజమాని ప్రకాష్ హిరాన్ అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహుతైనట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: Liquor Truck Accident: డ్రైవర్ సహాయం కోసం ఎదురు చూస్తుంటే.. మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్తున్న ప్రజలు..
Also Read
- స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
- Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
- Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
- WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్ యజమానులలో ఒకరైన ప్రకాష్ హిరాన్ గత వారం గేమింగ్ సెంటర్లోనే ఉన్నారు. అగ్నికీలలు చెలరేగి అగ్నిప్రమాదంలో మరణించినట్లు ధృవీకరించారు. ఈ దుర్ఘటనలో చిన్నారులు సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా ప్రకాష్ హిరాన్ ఎవరనే విషయాన్ని అధికారులు నిర్ధారించారు. సంఘటనా స్థలంలో లభించిన అవశేషాల నుంచి తీసిన నమూనాలు ప్రకాష్ తల్లి డీఎన్ఎతో సరిపోలడంతో అతని దురదృష్టవశాత్తు మరణించినట్లు నిర్ధారించారు.
ప్రకాష్ హిరాన్ అత్యంత లాభదాయకమైన TRP గేమ్ జోన్లో ప్రధాన వాటాదారు. అగ్నిప్రమాదం జరిగినప్పటి నుంచి CCTV ఫుటేజ్ సంఘటనా స్థలంలో ప్రకాష్ను గుర్తించారు. ప్రమాద సమయంలో అతను అక్కడే ఉన్నారనే సాక్ష్యాన్ని బలపరిచారు. ప్రకాష్ సోదరుడు జితేంద్ర హిరాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం తర్వాత ప్రకాష్తో ఎటువంటి సంబంధాలు లేదని, అన్ని ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయని తెలిపారు. ఇక అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రకాష్ కారు కూడా అక్కడే ఉన్నట్లుగా గుర్తించారు.
గేమ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి హిరాన్తో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేస్వే ఎంటర్ప్రైజెస్కు చెందిన ఐదుగురు భాగస్వాములతో కలిసి టీఆర్పీ గేమ్ జోన్ను నడిపిన ధవల్ కార్పొరేషన్ యాజమాన్యం ధవల్ ఠక్కర్ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో రేస్వే ఎంటర్ప్రైజెస్లో భాగస్వాములైన యువరాజ్సింగ్ సోలంకి, రాహుల్ రాథోడ్, గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Gun On Road: నడిరోడ్డుపై తుపాకీతో వ్యక్తిని కొట్టిన ఆ పార్టీ నాయకుడు.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
BMW X1 LWB: భారత్లో BMW X1 LWB విడుదల.. మొదటిసారి లగ్జరీ కారు కొనేవారిపై BMW కన్ను
-
Jailer 2 First Single: రజనీకాంత్ ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ అవుట్.. ‘అలా బొలేలో’తో అనిరుధ్ మ్యాజిక్.. పాటలో పూర్ణే హైలైట్!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
-
Vivo T5 5G: భారత్ లో త్వరలో విడుదల కానున్న వివో టి5 5జి.. 3డి కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ ఫీచర్స్
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?