Rajkot game zone: డీఎన్ఏ టెస్ట్ రిపోర్టు.. గేమ్ జోన్ యజమాని ఏమయ్యాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం గుజరాత్లోని రాజ్కోట్లో జరిగిన ఘోరం కళ్లముందు ఇంకా మెదిలాడుతోంది. గేమ్ జోన్ తగలబడి దాదాపు పిల్లలతో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే పలువురిని గుర్తుపట్టకపోవడంతో పోలీసులు డీఎన్ఏ టెస్టులు నిర్వహించారు. దీంతో పలువురి డీఎన్ఏ టెస్టులు రావడంతో కీలక విషయం బయటపడింది. రాజ్కోట్ గేమ్ జోన్ సహ యజమాని ప్రకాష్ హిరాన్ అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహుతైనట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: Liquor Truck Accident: డ్రైవర్ సహాయం కోసం ఎదురు చూస్తుంటే.. మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్తున్న ప్రజలు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్ యజమానులలో ఒకరైన ప్రకాష్ హిరాన్ గత వారం గేమింగ్ సెంటర్లోనే ఉన్నారు. అగ్నికీలలు చెలరేగి అగ్నిప్రమాదంలో మరణించినట్లు ధృవీకరించారు. ఈ దుర్ఘటనలో చిన్నారులు సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా ప్రకాష్ హిరాన్ ఎవరనే విషయాన్ని అధికారులు నిర్ధారించారు. సంఘటనా స్థలంలో లభించిన అవశేషాల నుంచి తీసిన నమూనాలు ప్రకాష్ తల్లి డీఎన్ఎతో సరిపోలడంతో అతని దురదృష్టవశాత్తు మరణించినట్లు నిర్ధారించారు.
ప్రకాష్ హిరాన్ అత్యంత లాభదాయకమైన TRP గేమ్ జోన్లో ప్రధాన వాటాదారు. అగ్నిప్రమాదం జరిగినప్పటి నుంచి CCTV ఫుటేజ్ సంఘటనా స్థలంలో ప్రకాష్ను గుర్తించారు. ప్రమాద సమయంలో అతను అక్కడే ఉన్నారనే సాక్ష్యాన్ని బలపరిచారు. ప్రకాష్ సోదరుడు జితేంద్ర హిరాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం తర్వాత ప్రకాష్తో ఎటువంటి సంబంధాలు లేదని, అన్ని ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయని తెలిపారు. ఇక అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రకాష్ కారు కూడా అక్కడే ఉన్నట్లుగా గుర్తించారు.
గేమ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి హిరాన్తో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేస్వే ఎంటర్ప్రైజెస్కు చెందిన ఐదుగురు భాగస్వాములతో కలిసి టీఆర్పీ గేమ్ జోన్ను నడిపిన ధవల్ కార్పొరేషన్ యాజమాన్యం ధవల్ ఠక్కర్ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో రేస్వే ఎంటర్ప్రైజెస్లో భాగస్వాములైన యువరాజ్సింగ్ సోలంకి, రాహుల్ రాథోడ్, గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Gun On Road: నడిరోడ్డుపై తుపాకీతో వ్యక్తిని కొట్టిన ఆ పార్టీ నాయకుడు.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!