Rajkot game zone: డీఎన్ఏ టెస్ట్ రిపోర్టు.. గేమ్ జోన్ యజమాని ఏమయ్యాడంటే..!
గత వారం గుజరాత్లోని రాజ్కోట్లో జరిగిన ఘోరం కళ్లముందు ఇంకా మెదిలాడుతోంది. గేమ్ జోన్ తగలబడి దాదాపు పిల్లలతో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే పలువురిని గుర్తుపట్టకపోవడంతో పోలీసులు డీఎన్ఏ టెస్టులు నిర్వహించారు. దీంతో పలువురి డీఎన్ఏ టెస్టులు రావడంతో కీలక విషయం బయటపడింది. రాజ్కోట్ గేమ్ జోన్ సహ యజమాని ప్రకాష్ హిరాన్ అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహుతైనట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: Liquor Truck Accident: డ్రైవర్ సహాయం కోసం ఎదురు చూస్తుంటే.. మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్తున్న ప్రజలు..
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్ యజమానులలో ఒకరైన ప్రకాష్ హిరాన్ గత వారం గేమింగ్ సెంటర్లోనే ఉన్నారు. అగ్నికీలలు చెలరేగి అగ్నిప్రమాదంలో మరణించినట్లు ధృవీకరించారు. ఈ దుర్ఘటనలో చిన్నారులు సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా ప్రకాష్ హిరాన్ ఎవరనే విషయాన్ని అధికారులు నిర్ధారించారు. సంఘటనా స్థలంలో లభించిన అవశేషాల నుంచి తీసిన నమూనాలు ప్రకాష్ తల్లి డీఎన్ఎతో సరిపోలడంతో అతని దురదృష్టవశాత్తు మరణించినట్లు నిర్ధారించారు.
ప్రకాష్ హిరాన్ అత్యంత లాభదాయకమైన TRP గేమ్ జోన్లో ప్రధాన వాటాదారు. అగ్నిప్రమాదం జరిగినప్పటి నుంచి CCTV ఫుటేజ్ సంఘటనా స్థలంలో ప్రకాష్ను గుర్తించారు. ప్రమాద సమయంలో అతను అక్కడే ఉన్నారనే సాక్ష్యాన్ని బలపరిచారు. ప్రకాష్ సోదరుడు జితేంద్ర హిరాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం తర్వాత ప్రకాష్తో ఎటువంటి సంబంధాలు లేదని, అన్ని ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయని తెలిపారు. ఇక అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రకాష్ కారు కూడా అక్కడే ఉన్నట్లుగా గుర్తించారు.
గేమ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి హిరాన్తో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేస్వే ఎంటర్ప్రైజెస్కు చెందిన ఐదుగురు భాగస్వాములతో కలిసి టీఆర్పీ గేమ్ జోన్ను నడిపిన ధవల్ కార్పొరేషన్ యాజమాన్యం ధవల్ ఠక్కర్ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో రేస్వే ఎంటర్ప్రైజెస్లో భాగస్వాములైన యువరాజ్సింగ్ సోలంకి, రాహుల్ రాథోడ్, గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Gun On Road: నడిరోడ్డుపై తుపాకీతో వ్యక్తిని కొట్టిన ఆ పార్టీ నాయకుడు.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!