NTV Telugu Site icon

Pragyan Rover: విక్రమ్ ల్యాండర్ ను ఫోటో తీసిన ప్రజ్ఞాన్‌ రోవర్‌..స్మైల్ ప్లీజ్ అంటూ ఎక్స్ లో షేర్ చేసిన ఇస్రో

Chan Copy

Chan Copy

Pragyan Rover Click the Photo of Vikram Lander: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్ 3 విజవంతమైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది భారత్. ఇక చంద్రుడిపై అడుపెట్టినప్పటి నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పనిని విజయవంతంగా చేస్తోంది. జాబిల్లికి సంబంధించిన అనేక సమాచారాన్ని పంపుతుంది.

Also Read: David Warner: ప్రైవేట్ పార్ట్‌పై హాట్ స్పాట్‌.. ఎయిర్‌పోర్టులో వార్నర్‌ను ఆపేసిన సిబ్బంది! చివరకు

తాజాగా తనని తీసుకువెళ్లిన విక్రమ్ ల్యాండర్ నే ఫోటో తీసింది ప్రజ్ఞాన్‌ రోవర్‌. ఈ ఫోటోను ఎక్స్(ట్విటర్) ఖాతా ద్వారా ఇస్రో పంచుకుంది. స్మైల్ ప్లీజ్ అంటూ ఈ ఫోటోను షేర్ చేసింది ఇస్రో. చంద్రుడిపై ఉపరితలంపై అన్వేషణ కొనసాగిస్తోన్న ప్రజ్ఞ‌ాన్ రోవర్.. విక్రమ్ ల్యాండర్‌ను తొలిసారిగా ఫోటోలు తీసింది. విక్రమ్ ల్యాండర్‌ను తన నావిగేషన్ కెమెరాల సాయంతో రోవర్ ఫోటోలు తీసింది. ప్రజ్ఞ‌ాన్ రోవర్‌లో అమర్చిన నావిగేషన్ కెమెరాలను (నావ్‌కేమ్) తో ఈ ఫోటోలు తీసింది రోవర్. ఇక వీటిని  బెంగళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ( LEOS) అభివృద్ధి చేసింది. ఈ కెమెరాతో హైక్వాలిటీ ఫోటోలను తీయవచ్చు. ఇక తనను తీసుకువెళ్లిన ల్యాండర్ ను స్మైల్ ప్లీజ్ అంటూ ఫోటో తీసిందని ఇస్రో ట్వీట్ చేసింది.

ఇక జాబిల్లి గురించి ప్రజ్ఞ‌ాన్ రోవర్ అనేక కొత్త కొత్త విషయాలను తెలియజేస్తోంది. ఇప్పటికే చంద్రునిపై చంద్రుడిపై ఆక్సిజన్, సిలికాన్ వంటి మూలకాలను గుర్తించి సమాచారాన్ని ఇస్రోకు పంపింది  ప్రజ్ఞాన్‌ రోవర్‌. అంతేకాకుండా చంద్రుడి  ఉపరితలంపై అల్యూమినియం, కాల్షియం, ఫెర్రస్, టైటానియం, మాంగనీష్ వంటి మూలకాలను కూడా గుర్తించారు. ఇక హైడ్రోజన్ కోసం ప్రజ్ఞ‌ాన్ రోవర్ అన్వేషణ ప్రారంభించింది. అది కనుక ఉంటే చంద్రుడిపై నివసించే అవకాశం మనుషులకు దొరుకుతుంది. ఇక చంద్రుడిపై టెంపరేచర్ కు సంబంధించిన సమాచారాన్నికూడా ఇస్రో పొందింది. త్వరలోనే మనుషులు జాబిల్లిపై జీవించవచ్చని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది చందమామపై భూమిని కూాడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.