Vizag KGH: కింగ్ జార్జ్ హాస్పిటల్కు వీడిన గ్రహణం.. కానీ మహిళా పెషేంట్ మృతి!
- కింగ్ జార్జ్ హాస్పిటల్కు వీడిన గ్రహణం
- 10 గంటల పాటు పేషెంట్ల తీవ్ర అవస్థలు
- ఆక్సిజన్ అందక మహిళా పెషేంట్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో అంధకారం అలముకుంది. దాదాపు 10 గంటల పాటు పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. బాలింతలు గర్భిణీలు చంటి పిల్లలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మొబైల్ వెలుతురులో వైద్యం అందిస్తూ, కొవ్వొత్తుల వెలుగులో విధులు నిర్వహిస్తూ నర్సింగ్ సిబ్బంది కూడా పడరాని పాట్లు పడ్డారు.
ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రికి గ్రహణం పట్టింది. మధ్యాహ్నం నుంచి విద్యుత్ నిలిచిపోవడంతో రోగులతో కిటకిటలాడే వార్డులన్నీ అంధకారంలో మగ్గిపోయాయి. చిమ్మ చీకటిలో రోగులు అల్లాడిపోయారు. రాజేంద్రప్రసాద్ వార్డు, భావనగర్ వార్డుతో పాటు చిన్నపిల్లల వార్డు, గైనిక్ వార్డులలోని పేషెంట్లు 10 గంటల పాటు నరకం చూశారు. వాష్ రూమ్లలో నీరు కూడా రాకపోవడంతో మహిళా పేషెంట్లు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో పేషంట్ల గోడు పట్టించుకునే నాధుడే కరువయ్యారు. కేజీహెచ్ అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
పిల్లల వార్డులో రోజులు నిండని పసికందులు గుక్క పెట్టి ఏడుస్తూ తల్లులను కంటతడి పెట్టించారు. విద్యుత్ కు అంతరాయం కలగడంతో పెద్ద ఆసుపత్రి మొత్తం చీకటిలో కూరుకుపోతే ఆంధ్ర మెడికల్ కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ ఫెస్టివల్లో మాత్రం విద్యుత్ కాంతులు విరజిల్లాయి. పేషెంట్లు నానా అవస్థలు పడుతుంటే పక్కనే ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉల్లాసంగా ఉత్సాహంగా కాబోయే డాక్టర్లు చిందులు వేయడం తీర విమర్శలకు దారితీసింది.
Also Read: Arundhati Reddy: అతడి వల్లే వన్డే వరల్డ్ కప్ను గెలిచాం.. అరుంధతి రెడ్డి ఆసక్తికర విషయాలు!
అర్ధరాత్రి 12 గంటల సమయంలో దేవి అనే మహిళా పేషంట్ ఊపిరి అందక చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆక్సిజన్ అవసరం ఉన్నప్పటికీ విద్యుత్ లేకపోవడంతో సిబ్బంది ఆక్సిజన్ పెట్టలేదని మండిపడ్డారు. ఆక్సిజన్ సరిపడా పెట్టుంటే ఆమె బతికి ఉండేదని వాపోయారు. పేషెంట్ మృతికి ఆసుపత్రి సిబ్బంది అధికారులు నిర్లక్ష్యమే కారణమని తీవ్రంగా మండిపడ్డారు. ఎట్టకేలకు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత విద్యుత్ పునరుద్దించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!