Vizag KGH: కింగ్ జార్జ్ హాస్పిటల్కు వీడిన గ్రహణం.. కానీ మహిళా పెషేంట్ మృతి!
- కింగ్ జార్జ్ హాస్పిటల్కు వీడిన గ్రహణం
- 10 గంటల పాటు పేషెంట్ల తీవ్ర అవస్థలు
- ఆక్సిజన్ అందక మహిళా పెషేంట్ మృతి
ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో అంధకారం అలముకుంది. దాదాపు 10 గంటల పాటు పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. బాలింతలు గర్భిణీలు చంటి పిల్లలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మొబైల్ వెలుతురులో వైద్యం అందిస్తూ, కొవ్వొత్తుల వెలుగులో విధులు నిర్వహిస్తూ నర్సింగ్ సిబ్బంది కూడా పడరాని పాట్లు పడ్డారు.
ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రికి గ్రహణం పట్టింది. మధ్యాహ్నం నుంచి విద్యుత్ నిలిచిపోవడంతో రోగులతో కిటకిటలాడే వార్డులన్నీ అంధకారంలో మగ్గిపోయాయి. చిమ్మ చీకటిలో రోగులు అల్లాడిపోయారు. రాజేంద్రప్రసాద్ వార్డు, భావనగర్ వార్డుతో పాటు చిన్నపిల్లల వార్డు, గైనిక్ వార్డులలోని పేషెంట్లు 10 గంటల పాటు నరకం చూశారు. వాష్ రూమ్లలో నీరు కూడా రాకపోవడంతో మహిళా పేషెంట్లు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో పేషంట్ల గోడు పట్టించుకునే నాధుడే కరువయ్యారు. కేజీహెచ్ అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
పిల్లల వార్డులో రోజులు నిండని పసికందులు గుక్క పెట్టి ఏడుస్తూ తల్లులను కంటతడి పెట్టించారు. విద్యుత్ కు అంతరాయం కలగడంతో పెద్ద ఆసుపత్రి మొత్తం చీకటిలో కూరుకుపోతే ఆంధ్ర మెడికల్ కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ ఫెస్టివల్లో మాత్రం విద్యుత్ కాంతులు విరజిల్లాయి. పేషెంట్లు నానా అవస్థలు పడుతుంటే పక్కనే ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉల్లాసంగా ఉత్సాహంగా కాబోయే డాక్టర్లు చిందులు వేయడం తీర విమర్శలకు దారితీసింది.
Also Read: Arundhati Reddy: అతడి వల్లే వన్డే వరల్డ్ కప్ను గెలిచాం.. అరుంధతి రెడ్డి ఆసక్తికర విషయాలు!
అర్ధరాత్రి 12 గంటల సమయంలో దేవి అనే మహిళా పేషంట్ ఊపిరి అందక చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆక్సిజన్ అవసరం ఉన్నప్పటికీ విద్యుత్ లేకపోవడంతో సిబ్బంది ఆక్సిజన్ పెట్టలేదని మండిపడ్డారు. ఆక్సిజన్ సరిపడా పెట్టుంటే ఆమె బతికి ఉండేదని వాపోయారు. పేషెంట్ మృతికి ఆసుపత్రి సిబ్బంది అధికారులు నిర్లక్ష్యమే కారణమని తీవ్రంగా మండిపడ్డారు. ఎట్టకేలకు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత విద్యుత్ పునరుద్దించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!