Potula Sunita: చంద్రబాబు చరిత్ర అంతా మహిళలను అడ్డుపెట్టుకుని చేసిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ మహిళాధ్యక్షురాలు అనితకు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదు అని వైసీపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. ఇంతకు అనిత అన్నం తింటుందా? గడ్డి తింటుందా?.. ఆమె పచ్చకామెర్లతో బాధ పడుతోంది.. అందుకే ఎన్సీఆర్బీ రిపోర్టుని కూడా పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు అని పోతుల సునీత విమర్శించారు. వైసీపీలో హోంమంత్రి, మండలి వైస్ ఛైర్మన్ లాంటి ముఖ్యమైన పదవుల్లో సైతం మహిళలే ఉన్నారు.. చంద్రబాబు చరిత్ర అంతా మహిళలను అడ్డుపెట్టుకుని చేసిందేనని పోతుల సునీత అన్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీ పార్టీని లాక్కునే దగ్గర్నుండి అనేక విషయాల్లో మహిళలను ఆయన అడ్డుపెట్టుకుని చేశారని విమర్శించారు.
Read Also: Ameesha patel : నటి అమిషా పటేల్ కు షాక్ ఇచ్చిన రాంచి సివిల్ కోర్ట్..
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
టీడీపీ ఎందుకిలా అసత్యాలు ప్రచారం చేస్తుందని వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. రాష్ట్రం దిశ యాప్ తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం.. పదవుల్లో సైతం మహిళకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం.. పవన్, చంద్రబాబు, లోకేష్ వాలంటీర్లపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఇప్పుడు తోక ముడిచారు అని ఆమె కామెంట్స్ చేశారు. మహిళల పుట్టుక గురించే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నా టీడీపీ నేతలు చూడలేకపోతన్నారు అని సునీత విమర్శలు గుప్పించారు.
Read Also: Elgar Parishad Case: ఎల్గార్ పరిషత్ కేసు.. ఇద్దరికి సుప్రీం బెయిల్ మంజూరు
విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ నడిపిన వారికి చంద్రబాబు పదవులు ఇచ్చారు అని పోతుల సునీత ఆరోపించారు. రిషితేశ్వరి ఘటనను కప్పి పుచ్చే ప్రయత్నం చేసిన నీచ చరిత్ర చంద్రబాబుది అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల తోక కట్ చేస్తా, తోలు తీస్తా అన్న చంద్రబాబు బీసీలకు ఇంకేం న్యాయం చేస్తారు..?.. మహిళల ఆత్మ గౌరవం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్ లకు లేదు అని ఆమె పేర్కొన్నారు. మహిళల మిస్సింగులు ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి.. కానీ జగన్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు పవన్, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అని పోతుల సునీత అన్నారు.
తాజావార్తలు
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!