ఎవరైనా దొంగతనం చేసినా, దోచుకున్నా, హత్య చేసినా చట్టం అతనికి కఠిన శిక్ష విధిస్తుంది. అయితే కొందరిని కౌగిలించుకున్నందుకు ఎవరైనా శిక్షించగలరా? ఇటీవల నార్త్ ఆఫ్రికా దేశంలోని అల్జీరియన్ చెందిన ఓ వ్లాగర్కు అలాంటి ఘటన చోటుచేసుకుంది. శాంతి, సానుకూలతను వ్యాప్తి చేయడానికి వీధిలో యాదృచ్ఛిక వ్యక్తులను కౌగిలించుకున్నందుకు అల్జీరియన్ వ్యక్తి ఇటీవల అసభ్య ప్రవర్తనకు దోషిగా నిర్ధారించారు. రెండు నెలల జైలు శిక్ష విధించారు. అసలేం జరిగిందంటే.. అల్జీరియాకు చెందిన 30 ఏళ్ల వ్లాగర్ “మహమ్మద్ రామ్జీ” మరో ప్రముఖ వ్లాగర్ స్ఫూర్తితో టిక్టాక్ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను కౌగిలించుకునే సామాజిక ప్రయోగం చేశారు. కానీ అల్జీరియాలో ప్రజలకు ఇలాంటివి నచ్చలేదు. అటువంటి పరిస్థితిలో.. ఆ వీడియోలపై సోషల్ మీడియాలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
READ MORE: Pawan Kalyan Win: ఇంకా మనల్ని ఎవరు రా ఆపేది.. టాలీవుడ్ హీరోయిన్ సంబరాలు!
ఈ తప్పిదానికి మహమ్మద్ క్షమాపణలు చెప్పారు. కానీ విషయం కాస్త కోర్టుకు చేరింది. గత సంవత్సరం.. ఒక కోర్టు అతడిని అన్ని ఆరోపణలపై నిర్దోషిగా గుర్తించింది. కానీ ప్రాసిక్యూటర్లు తీర్పును అప్పీల్ చేసిన తర్వాత అతని కేసు అల్జీరియన్ జ్యుడీషియల్ కౌన్సిల్కు సూచించారు. ఈసారి అతను దోషిగా నిర్ధారించబడ్డారు. రామ్జీ అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. కోర్టు నిర్ణయం ప్రకారం.. మహ్మద్ రంజీ రెండు నెలల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 5 మిలియన్ దినార్లు ($37,000) జరిమానా కూడా చెల్లించాలని కోర్టు తీర్పిచ్చింది. తన వీడియో ద్వారా శాంతి, ప్రేమను వ్యాప్తి చేయడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. కానీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.