UEFA Nations League 2025: పోర్చుగల్ జట్టును నేషన్స్ లీగ్ విజేతగా నిలిపిన క్రిస్టియనో రోనాల్డో..!
- నేషన్స్ లీగ్ 2025 విజేతగా పోర్చుగల్ జట్టు.
- 2-2తో మ్యాచ్ నిలవడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్
- పెనాల్టీ షూటౌట్ లో 5-3తో పోర్చుగల్ విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UEFA Nations League 2025: నేషన్స్ లీగ్ యూరోపియన్ దేశాల జాతీయ ఫుట్బాల్ జట్ల మధ్య నిర్వహించబడే UEFA ఆధ్వర్యంలోని టోర్నమెంట్. మొదటిసారి ఇది 2018-19లో ప్రారంభమైంది. టోర్నమెంట్ ఉద్దేశ్యం స్నేహపూర్వక మ్యాచ్లకు ప్రత్యామ్నాయంగా అధిక స్థాయిలో పోటీ ప్రదర్శనను తీసుకురావడమే. తొలి సీజన్లోనూ పోర్చుగల్నే విజేతగా నిలిచింది. ఫుట్బాల్ ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేసే యూరోపియన్ నేషన్స్ లీగ్ టోర్నమెంట్ విజేతగా మళ్లీ పోర్చుగల్ నిలిచింది. జాతీయ జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ టోర్నీలో క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు భీకర ఆటతీరుతో స్పెయిన్ ను పెనాల్టీ షూటౌట్లో ఓడించి రెండోసారి టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పోర్చుగల్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్తో ఆడింది. మ్యాచ్ తొలి భాగంలోనే రెండు జట్లు చెరో గోల్ సాధించాయి. 21వ నిమిషంలో స్పెయిన్ తరఫున మార్టిన్ జుబిమెండి తొలి గోల్ చేయగా, ఐదు నిమిషాల వ్యవధిలోనే పోర్చుగల్ ఆటగాడు న్యూనొ మెండెస్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు.
Read Also: YS Jagan: కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా..? ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ సీఎం..!
Also Read
తర్వాత తొలి అర్ధ భాగం చివర్లో స్పెయిన్ ఆటగాడు ఒయర్లబెల్ మరో గోల్ చేసి తన జట్టును 2-1తో ముందుకు తీసుకెళ్లాడు. అయితే, రెండో భాగంలో పోర్చుగల్ తిరిగి పోటీలోకి వచ్చింది. 61వ నిమిషంలో స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గోల్ చేసి స్కోరును మళ్లీ సమం చేశాడు. ఇది రొనాల్డో అంతర్జాతీయ కెరీర్లో 138వ గోల్. ఇక నిర్ణీత సమయం, అదనపు సమయాల్లోనూ 2-2తో మ్యాచ్ నిలవడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్కు వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ పోర్చుగల్ మెరుగైన ఆటతీరు ప్రదర్శించింది.
Read Also: Renu Desai : నిజాయితీగా ఉండాలంటే.. దేనికైనా సిద్ధంగా ఉండాలి
పెనాల్టీ షూటౌట్ లో స్పెయిన్ తరఫున మెరినో, బెయెనా, ఇస్కో విజయవంతంగా గోల్స్ సాధించగా.. నాలుగో కిక్ వేయడానికి వచ్చిన అల్వారో మొరాటా ప్రయత్నాన్ని పోర్చుగల్ గోల్కీపర్ డీగో కోస్టా చాకచక్యంగా అడ్డుకున్నాడు. ఇదే టర్నింగ్ పాయింట్గా నిలిచి పోర్చుగల్ విజయానికి బాటలు వేసింది. పోర్చుగల్ తరఫున రామొస్, విటిన్హా, ఫెర్నాండెజ్, మెండెస్, నివెస్ పెనాల్టీల్లో విజయవంతంగా గోల్స్ చేయడంతో 5-3 తేడాతో పోర్చుగల్ విజయం సాధించింది. ఇక విజయానంతరం జట్టు విజయంలో కీలకంగా నిలిచిన రొనాల్డో భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విజయంతో పోర్చుగల్ జట్టు ప్రపంచ ఫుట్బాల్ రంగంలో తమ స్థానం మరింత బలోపేతం చేసుకుంది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!