NTV Telugu Site icon

Pooja Hegde : పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం.. ఆమె మరణంతో..

Poojaa Hegde

Poojaa Hegde

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. పూజాకు ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మను కోల్పోయింది.. ఆమె అంటేపూజాకు ఎంతో ఇష్టం.. తనను ప్రాణంగా చూసుకునేదట. పూజా హెగ్డేకి ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మ గారు ఈ మధ్య మరణించారు.. పూజా హెగ్డే అమ్మ వాళ్ల అమ్మ కన్నుమూయడంతో.. వారి ఇంట విషాద ఛాలయలు అలముకున్నాయి.

ఈ విషయాన్ని పూజా హెగ్డే తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. అంతేకాదు తన అమ్మమ్మతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది.. ఆమెతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.. తాజాగా ఓ ఫోటోని షేర్ చేసి..’వుయ్ మిస్ యు అజి’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ తో ఈ విషాదాన్ని అభిమానులతో పంచుకుంది అమ్మడు.. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఆమెను ఓదార్చుతున్నారు.. ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది
రెండు రోజుల క్రితం పూజ హెగ్డే సిస్టర్ భూమి శెట్టి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళిలో తన ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది పూజ..

ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు.. అంతలోనే ఆమె మరణించింది… ఆ విషయం అందరిని విషాదంలోకి నెట్టివేసింది.. ఇకపోతే పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఇబ్బంది పడుతోంది పూజా.. గుంటూరు కారం నుంచి తప్పుకున్న పూజా.. సల్మాన్ తో కిసికా జాన్ మూవీలో చేసింది. బాలీవుడ్ లో ఈమూవీ ప్లాప్ అవ్వడంతో.. అక్కడ కూడా ఆమెకు పెద్దగా ఆపర్లు లేవు.. తెలుగులో ఆచార్య తర్వాత ఒక్క సినిమా కూడా అనౌన్స్ చెయ్యలేదు.. ఐరన్ లెగ్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..