Ponnam Prabhakar: అప్పుడు ఆర్టీసీ ఉంటుందా అనుకునే పరిస్థితి.. ఇప్పుడు లాభాల్లో నడుస్తోంది!
- ఆర్టీసీ ఉంటుందా? అనుకునే పరిస్థితి
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాల్లోకి ఆర్టీసీ
- ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత ప్రయాణం ఉపయోగించుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponnam Prabhakar’s statement on TSRTC: గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నిర్వీర్యం చేశారని, ఓ సమయంలో ఆర్టీసీ ఉంటుందా? అని కూడా అనుకునే పరిస్థితి ఉండేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల్లోకి వస్తుందని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పైసలు వాడుకున్న పరిస్థితి ఉండేదని, ఇప్పుడు వారికి డబ్బులు చెల్లిస్తున్నాం అని చెప్పారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు బస్సులకు యజమానులకు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలు చేసిందన్నారు. ఆర్టీసీకి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉంటుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంజీబీఎస్ బస్టాండ్లో ఆర్టీసీ వేడుకలునిర్వహించింది. ఈ వేడుకలకు మంత్రి పొన్నం హాజరై మాట్లాడారు.
‘200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణం పూర్తయిన సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన 2023 డిసెంబర్ 9న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శాసన సభ వేదిక మహాలక్ష్మి పథకం ప్రారంభించుకున్నాం. ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్నాం. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా వెళ్తున్నారు. ఉద్యోగాలు, షాపింగ్, దేవాలయాలు… ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత ప్రయాణం ఉపయోగించుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. ఆర్టీసీ ఉంటుందా అని కూడా అనుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి వస్తుంది. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం, నియామకాలు చేస్తున్నాం. గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పైసలు వాడుకున్న పరిస్థితి, ఇప్పుడు వారి డబ్బులు చెల్లిస్తున్నాం’ అని మంత్రి పొన్నం తెలిపారు.
Also Read
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
Also Read: Bhatti Vikramarka: మహిళలు రూ.6680 కోట్లు ఆదా చేసుకున్నారు.. అందరికీ శుభాకాంక్షలు!
‘సంస్థ పరిరక్షణ ప్రయాణికుల సౌకర్యం ఉద్యోగుల సంక్షేమం నినాదంతో ఆర్టీసీ ముందుకు పోతుంది.ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు బస్సులకు యజమానులకు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలు చేసింది. ఇటీవల 150 బస్సులకి కోటి రూపాయల చెక్కులు కూడా అందజేసాము. గతంలో 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. 60 శాతం ఉన్న ఆక్యుపెన్సీ ఇప్పుడు 97 శాతంకి పెరిగింది. ఆర్థిక విధ్వంసం తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆర్టీసీకి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది. ఈరోజు 97 బస్సు డిపోలు, 324 బస్ స్టేషన్లలో 200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు 6680 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు నిర్వహిస్తున్నాం’ అని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!