Ponnam Prabhakar: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. నామినేషన్ల పర్వం కొనసాగుతుండడంతో బరిలో నిలిచే నేతలంతా ఒక్కొక్కరిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్ పత్రాలను ఆ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్ దాఖలు చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్వో కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హుస్నాబాద్ మెట్ట ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. సెంటిమెంట్కే హుస్నాబాద్ అంటున్నారని.. అభివృద్ధి అంతా సిద్ధిపేట, గజ్వేల్లో చేస్తున్నారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ పదేళ్లయిన పూర్తి చేయలేదని పొన్నం విమర్శించారు. హుస్నాబాద్ ప్రాంతానికి వెన్నెముక లాంటి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. అందుకే హుస్నాబాద్ ప్రాంత ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.
Read Also:Varun Tej: అరేయ్ బాబు.. మా పెళ్లి వీడియోను అమ్ముకోలేదు రా అయ్యా.. వరుణ్ టీం క్లారిటీ..
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సిపిఐ శ్రేణులు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. అపర భగీరథుడు అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందంటూ ఎద్దేవా చేశారు. హుస్నాబాద్ మెట్ట ప్రాంత వరప్రదాయని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పట్టించుకోవడంలో విఫలమయ్యాడన్నారు. బిఆర్ఎస్, బిజెపిలు రెండు ఒక్కటే, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పొన్నం ప్రభాకర్ గెలుపు కమ్యూనిస్టుల గెలుపుగా భావిస్తున్నామని చాడా తెలిపారు.
Read Also:Balineni Srinivasa Reddy: నిరాధారంగా నాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు..
తాజావార్తలు
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
-
NBK 111: బిగ్ రిస్క్ లో బాలయ్య?
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
-
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!