Ponnam Prabhakar: మా బాధ్యత నిర్వహించాం.. ఇక మీ చేతుల్లోనే ఉంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం కోసం పంపామని.. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మార్చి 30 నుంచి గవర్నర్ దగ్గరకు వెళ్ళిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో బిల్లులు పాస్ చేసుకున్నట్లు చెప్పారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం, తదుపరి చర్యలు తీసుకపోవడం వల్ల అమలు జాప్యం జరుగుతుందన్నారు. న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తాం.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు.. అన్ని రకాల పోరాటాలు జరిగే సందర్భంలో తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మాదిగ దండోరా, మాల మహానాడు, బీసీ సంఘాలు ఐక్య సమితిగా బంద్కి పిలునిచ్చారన్నారు. వారికి అభినందనలు తెలిపారు.
READ MORE: Python: అక్కా.. అది అనకొండ.. ఆడుకునే వస్తువు కాదు.. జర పైలం
Also Read
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
బంద్ ప్రశాంతంగా జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. “రవాణా శాఖ మంత్రి గా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా బంద్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు అసౌకర్యం అయినప్పటికీ బంద్ ప్రభుత్వాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బండి సంజయ్, కిషన్ రెడ్డిలు, బీజేపీ ఎంపీ లంతా తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు కేంద్రానికి చెప్పే ప్రయత్నాలు చేయాలి. రిజర్వేషన్లు అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుంది.. కేంద్రంలో బాధ్యత మీది.. రాష్ట్రంలో మా బాధ్యత నిర్వహించాం.. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఏ న్యాయస్థానంలో అయినా మేము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం.. బంద్ లో పాల్గొన్న ప్రజలకు అభినందనలు..” అని పొన్నం వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!