Ponnam Prabhakar : ప్రభుత్వం వైద్యంలో అనేక సంస్కరణలు చేపట్టింది
- అమీర్ పేట్ CHCను పరిశీలించిన హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
- అమీర్ పేట్ 50 పడకల ఆసుపత్రి సందర్శించడం జరిగింది
- ఇక్కడ ఉన్న పరిస్థితులు డాక్టర్లు, ఎమర్జెన్సీ, గైనిక్, మందులు, ల్యాబ్ లను పరిశీలించడం జరిగింది : మంత్రి పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : అమీర్ పేట్ CHC (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ను హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. హాస్పిటల్ లో ఉన్న డాక్టర్లు, రోగులు, రోగుల బంధువులతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హాస్పిటల్కి ప్రతిరోజూ వస్తున్న ఓపీలు ఎన్ని, ఎమర్జెన్సీ కేసులు ఎన్ని, ప్రతి నెలలో జరుగుతున్న గర్భిణీ ప్రసూతులు ఎన్ని తదితర వాటిపై హాస్పిటల్ సూపరిండెంట్ను అడిగి తెలుసుకున్నారు. గైనకాలాజీ విభాగాన్ని పరిశీలించారు.. ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే రోగులకు విశ్వాసం కల్పించేలా పని చేయాలని వైద్యులకు సూచించారు మంత్రి.. చిన్న పిల్లలకు మందులు ఇచ్చే గది ఫార్మా రూం, ల్యాబ్ లను పరిశీలించారు మంత్రి పొన్నం. మెడికల్ ఓపీ పరిశీలించి.. స్వయంగా బీపీ చెకప్ చేసుకున్నారు. ఏమైనా మందుల కొరత ఉందా అని అడిగి తెలుసుకున్నారు.. ఏ ఏ మందులు ఎక్కువగా వెళ్తుంటాయి అడగగా బీపీ ,షుగర్ ,ఫీవర్ , జలుబు ఎక్కువగా ప్రతి నెల వినియోగంలో ఉంటాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బయో మెడికల్ వెస్టేజ్ ప్రాంతాన్ని పరిశీలించారని, హాస్పిటల్లో పని చేసే శానిటేషన్ సిబ్బందికి కొద్ది నెలలుగా జీతాలు రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే వైద్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేశారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, హాస్పిటల్ సూపరిండెంట్ మహమ్మద్ రావుఫ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
UI Movie : “యూఐ” మూవీకి సంబంధించిన ఆ వార్తలన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన యూనిట్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. అమీర్ పేట్ 50 పడకల ఆసుపత్రి సందర్శించడం జరిగిందని, ఇక్కడ ఉన్న పరిస్థితులు డాక్టర్లు, ఎమర్జెన్సీ, గైనిక్, మందులు, ల్యాబ్ లను పరిశీలించడం జరిగిందన్నారు. ఇక్కడి ఏరియా అంత పేషంట్స్ ఇక్కడికే వస్తున్నారని, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియన కలిసి అదనంగా 50 పడకలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నా అని ఆయన అన్నారు. 50 పడకల పెంచాలని జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపుతారని, SDF ఫండ్స్ కింద జిల్లా ఇంచార్జ్ మంత్రి గా హాస్పిటల్ కి లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. 24 గంటలు హాస్పిటల్లో విద్యుత్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, 108 అంబులెన్స్ హాస్పిటల్ కి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
10 డయాలిసిస్ బెడ్స్ ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం వైద్యంలో అనేక సంస్కరణలు చేపట్టిందని, మా ప్రభుత్వం డాక్టర్లు ,నర్సు లో ,ల్యాబ్ అసిస్టెంట్ , ఫార్మసీస్ట్ ల నియామకాలు చేపట్టిందన్నారు. రోగుల ఆరోగ్యానికి నిరంతర ప్రక్రియ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని, శానిటేషన్ సిబ్బంది జీతాలు రాలేదంటే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేశామన్నారు. మందులు అన్ని ఉన్నాయి.. గతం కంటే ఎక్కడ ఇబ్బందులు లేవని, ఫ్రీ మెడిసిన్ ఇవ్వడానికి టాప్ ప్రయారిటీ కల్పిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
MG Windsor EV: కొనుగోలుదారులకు షాక్.. కార్ల ధరను భారీగా పెంచేసిన ఎంజీ
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..