Ponnala Lakshmaiah : ఎర్రకోట ప్రసంగాన్ని ప్రధాని మోడీ రాజకీయాల కోసం వాడుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎర్రకోట ప్రసంగాన్ని ప్రధాని మోడీ రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. మణిపూర్ శాంతి నెలకొంటుంది అంటున్న ప్రధాని పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశం ఎందుకు మాట్లాడలేదన్నారు. ప్రధాని మణిపూర్ లో పర్యటించి ప్రజలకి విశ్వాసం కలిగించి ఉంటే బాగుండేదని, ఏమి చేయలేదు కానీ ఎర్రకోట వేదికగా మణిపూర్ గురించి మోడి మాట్లాడారన్నారు. ప్రధాని మోడీ బీజేపీ నాయకులు ఎవరైనా మణిపూర్ లో పర్యటించారా ? అని ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో ప్రధాని ఏం చేశారు.. గంట కొట్టారు , దీపాలు పెట్టారు , చప్పట్లు కొట్టారు దానివల్ల కోవిడ్ ఏమైనా తగ్గిందా ? రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించకుండా దొంగచాటుగా వ్యాక్సిన్లు తయారు చేసే వాళ్ళకి పవర్ ఇస్తారు ..ఇలానే ప్రధానమంత్రి చేస్తారా ? అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
Also Read : Thomas Reddy : వెంటనే గవర్నర్ ఆర్టీసి విలీన బిల్లు ఆమోదం తెలపాలి
Also Read
అంతేకాకుండా.. ‘కోట్లాదిమంది ప్రజలు పాదయాత్రలు, సైకిల్ యాత్రల ద్వారా తమ గమ్య స్థలానికి చేరుకున్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు తప్ప లక్షలాది మంది ప్రజల ఉద్యోగాలు కోల్పోయారు, తమ పిల్లలు తో సహా తమ స్వస్థలాలకు వెళ్లారు. కేంద్ర రాష్ట్రాలు గ్యాస్ , పెట్రోల్, డీజిల్ పైన టాక్స్ ఎందుకు తగ్గించడం లేదు. దేశం జనాభా లో 90శాతం మంది సామాన్య ప్రజలలే GST కడుతున్నారు. ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు, 2 కోట్లు ఉద్యోగాలు, నల్ల ధనం లేకుండా చేస్తాం, ఇల్లు , విద్యుత్ , నీరు దేశంలో ప్రతిఒక్కరికి అందిస్తామని చెప్పారు … ఏమైనా నెరవేర్చరా ? 9 ఏళ్ల పాలనలో మహిళల రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉంది. బీజేపీకి అవకాశం ఉన్న ఎందుకు చేయడంలేదు. పార్టీ ఫిరాయింపుల చట్టం 9 ఏళ్ళు నుండి పెండింగ్ లో ఉంది. 9 రాష్ట్రాల ప్రభుత్వాలు ను కూలగొట్టిన నీచ ప్రభుత్వం బీజేపీది’ అని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.
Also Read : Devineni Avinash: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీకి దమ్ముంటే చర్చకు రావాలి
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!