Ponguleti Srinivasa Reddy: సస్పెన్ష్కు తెరదించిన పొంగులేటి.. అమిత్ షా ఖమ్మం రాకముందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్లో చేరనున్నారు. బీజేపీలో చేరతారా, కాంగ్రెస్లో చేరతారా అని రెండు నెలల పాటు ఊగిసలాట ధోరణి కనబర్చారు.. కానీ, కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో.. ఆ పార్టీవైపే మొగ్గు చూపారు. ఈ ఏడాది జనవరి 1న కేసీఆర్ సర్కార్పై పొంగులేటి ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత నిరసన స్వరం పెంచారు. దీంతో ఆ పార్టీ పొంగులేటిని సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేశాక మరింతగా బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు పొంగులేటి. బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి రానీయకుండా చూడడం, కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యమంటున్న పొంగులేటి.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్లను తాకనీయనంటూ శపథం కూడా చేశారు.
Read Also: Amit Sha Tour: రేపు హైదరాబాద్ కు అమిత్ షా.. రాజమౌళి పలువురు ప్రముఖులతో భేటీ..!
Also Read
- Astrology: మే 23 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
ఇక, ఈటల రాజేందర్తో ఉన్న అనుబంధంతో తొలుత పొంగులేటి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కొంతకాలానికి బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో కలిసి కొత్త పార్టీ పెడతారని టాక్ వినిపించింది. కానీ, కర్ణాటక ఫలితాల ప్రభావంతో క్రమంగా కాంగ్రెస్ వైపు చూపారు. సునీల్ కనుగోలు.. చర్చలు జరిపి పొంగులేటి కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా చేయగలిగారు. పార్టీలో పొంగులేటికి మంచి పొజిషన్ ఇవ్వడమే కాకుండా, ఆయన అనుచరులకు సీట్లు ఇచ్చే విషయంలోనూ హామీ ఇవ్వడంతో.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు పొంగులేటి. బుధవారం మంచి రోజు కావడంతో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Varahi Yatra: వారాహి యాత్రకు సర్వం సిద్ధం.. అన్నవరానికి జనసేనాని
2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్పై ఎంపీగా గెల్చిన పొంగులేటి, ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా నాటి టీఆర్ఎస్లో చేరారు. 2019 ఎన్నికల్లో పొంగులేటికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో.. అప్పట్నుంచి కేసీఆర్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. గత నెలలో పొంగులేటిని పార్టీలో ఆహ్వానించడానికి ఆయన ఇంటికి బీజేపీ కీలక నేతలంతా వెళ్లారు. సో.. కాంగ్రెస్ నేతలు కూడా ఆ తరహాలోనే వెళ్లనున్నారు. బుధవారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ ఆహ్వానించాక.. పొంగులేటి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ ఓటమే లక్ష్యమంటున్న పొంగులేటి.. ఆయా నియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్లు కోరుతున్నారు. మధిర, భద్రాచలం సిట్టింగ్ కాంగ్రెస్ సీట్లు తప్ప మిగిలిన సీట్లు అన్నీ తన వర్గం వారికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, సర్వేల ప్రాతిపదికన సీట్లను ఇస్తామని చెబుతూనే, పొంగులేటికి సీట్ల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తామని సునీల్ కనుగోలు హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్లో చేరికకు లైన్ క్లియర్ అయ్యింది.
తాజావార్తలు
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Astrology: మే 23 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!