Ponguleti Srinivas Reddy : ప్రజలు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలు తెలంగాణ లో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని, అభయ హస్తంలో భాగంగా ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం వారి అవసరాలు, బాధలు తెలుసుకో లేదన్నారు. ఎనిమిది రోజుల పాటు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీ గ్రామానికి, వార్డుకు, అడవిలోని చెంచు గుడానికి అధికారులు వెళ్లారని, ప్రజా పాలన విజయవంతం అయ్యిందన్నారు. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులతో లోతైన చర్చ జరిగింది. కోటి ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తులు తీసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల దగ్గరకే పాలన తీసుకు వెళ్తామని ఆనాడే హామీ ఇచ్చామని, దేశంలో ఏ రాష్ట్రంలో తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున కోటి 25 లక్షల అర్జీలు సేకరించాము. చిన్న సంఘటన కూడా లేకుండా నిర్వహించామన్నారు.
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ప్రతిపక్షాల నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. 40 రోజుల్లో హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారని, వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాము.ఎవరైనా కారు కూతలు కూసిన మా మాటకు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కేబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్ గా ఉండనున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. ప్రజలకు ఆరు గ్యారంటీలను చేరువ చేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?