Ponguleti Srinivas Reddy : ప్రజలు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలు తెలంగాణ లో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని, అభయ హస్తంలో భాగంగా ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం వారి అవసరాలు, బాధలు తెలుసుకో లేదన్నారు. ఎనిమిది రోజుల పాటు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీ గ్రామానికి, వార్డుకు, అడవిలోని చెంచు గుడానికి అధికారులు వెళ్లారని, ప్రజా పాలన విజయవంతం అయ్యిందన్నారు. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులతో లోతైన చర్చ జరిగింది. కోటి ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తులు తీసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల దగ్గరకే పాలన తీసుకు వెళ్తామని ఆనాడే హామీ ఇచ్చామని, దేశంలో ఏ రాష్ట్రంలో తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున కోటి 25 లక్షల అర్జీలు సేకరించాము. చిన్న సంఘటన కూడా లేకుండా నిర్వహించామన్నారు.
Also Read
ప్రతిపక్షాల నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. 40 రోజుల్లో హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారని, వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాము.ఎవరైనా కారు కూతలు కూసిన మా మాటకు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కేబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్ గా ఉండనున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. ప్రజలకు ఆరు గ్యారంటీలను చేరువ చేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!