Udayagiri Politics: ఉదయగిరిలో ఉద్రిక్త పరిస్థితులు.. రసవత్తరంగా రాజకీయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udayagiri Politics: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. నేతలు, వైసీపీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో జిల్లాలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. తను తరిమేస్తానన్న వైసీపీ నేతలు రావాలంటూ.. ఉదయగిరి బస్టాండ్ వద్ద మేకపాటి బైఠాయించడంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్జాయి. గురువారం సాయంత్రం ఉదయగిరిలోని బస్టాండ్ సమీపంలోని రోడ్డు మీదకు అభిమానులతో వచ్చి రోడ్డుపై కుర్చీలో కూర్చుని, తన వ్యతిరేక వర్గ నేతలకు మేకపాటి ప్రతిసవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఉదయగిరికి వస్తే తరుముతామన్న వాళ్లు రావాలంటూ.. మేకపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
ఇదిలా ఉండగా.. దమ్ముంటే ఉదయగిరికి రావాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని సవాల్ చేసిన వైసీపీ నేతలు ఇవాళ బస్టాండ్ సెంటర్కు చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున సెంటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఉదయగిరి వైసీపీ నేత భాస్కర్ రెడ్డి బస్టాండ్ సెంటర్ వచ్చి దమ్ముంటే శేఖర్ రెడ్డి ఇక్కడికి రావాలని సవాల్ విసిరారు. మరో వైపు సుబ్బారెడ్డి కూడా తన అనుచరులతో బస్టాండ్ సెంటర్కు చేరుకున్నారు. ఎమ్మెల్యే వర్గం కూడా బస్టాండ్ సెంటర్కు వస్తారననే సమాచారం రావడంతో మరింత మంది పోలీసులను రప్పిస్తున్నారు.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
Read Also: JP Nadda: ఏపీ-తెలంగాణలో నూతన బీజేపీ ఆఫీస్.. వర్చువల్ ద్వారా ప్రారంభించనున్న జేపీ నడ్డా
అధికార వైసీపీకి బహిష్కృత నేతల నుంచి తలపోటు తగ్గడం లేదు. పార్టీలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయడానికి కాస్త ఆచితూచి వ్యవహరించిన వైసీపీ బహిష్కృత నేతలు పార్టీ నుంచి బయటికి వచ్చాకా విమర్శలకు పదును పెట్టారు. వారిపై కఠిన చర్యలు తీసుకుందామంటే ఇంతకాలం జరిగిన అంతర్గత అంశాలను సైతం బహిరంగ పరుస్తూ… అధికార పార్టీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా రాజకీయ పరిణామాలను తయారు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సైతం తాను వైసీపీ నేతలు చేసే దందాలకు అడ్డు వస్తాననే తనపై ఆరోపణలు చేశారని వెల్లడించింది. ఇక కోటం రెడ్డి మరో రెండు అడుగులు ముందుకేసి.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీని శాశ్వతంగా బహిష్కరిస్తారని… ఎన్నికల్లో రాజకీయంగా సునామీ రాబోతుందని ప్రకటిస్తున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!