Fake Notes: సినిమాలో చూసి.. దొంగ నోట్ల ముద్రణ.. చివరికి ఏమైదంటే?
- గుజరాత్లోని సూరత్లో నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టు
- సినిమాలో చూసి.. దొంగ నోట్ల ముద్రణ
- ఒక్కసారిగా ధనవంతులు కావాలని లక్ష్యం
- కానీ.. చెదిరిన కల
గుజరాత్లోని సూరత్లో నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్లైన్లో వస్త్ర దుకాణం పేరుతో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి నిల్వ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆదివారం మాట్లాడుతూ.. గుజరాత్లోని సూరత్లోని ఓ ఆన్లైన్ వస్త్ర దుకాణం కార్యాలయంలో నకిలీ నోట్ల ముద్రణ జరుగుతోందని తెలిపారు. ఈ కేసులో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
READ MORE: Balineni Srinivas Reddy: ఈనెల 26న పవన్ సమక్షంలో జనసేనలోకి బాలినేని..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం.. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజ్దీప్ నకుమ్ మాట్లాడుతూ.. నిందితులు నటుడు షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’ నుంచి ప్రేరణ పొందారని, ఇందులో నకిలీ నోట్ల వ్యాపారం చేయడం ద్వారా ధనవంతులుగా మారే పాత్రను ఆదర్శంగా తీసుకున్నట్లు తెలిపారు. సూరత్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) అధికారులు శనివారం సార్థనా ప్రాంతంలోని ఓ కార్యాలయంపై దాడి చేసి నాణ్యమైన, అసలు నోట్లను పోలి ఉన్న రూ.1.20 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఘటనా స్థలం నుంచి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
READ MORE:Tragedy: విహారయాత్రలో విషాదం.. వాటర్ఫాల్స్లో ఐదుగురు మెడికల్ విద్యార్థులు గల్లంతు
ఆన్లైన్ స్టోర్ పేరుతో నకిలీ నోట్ల ముద్రణ..
ముగ్గురు నిందితులను విచారించిన తరువాత, నాల్గవ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఆన్లైన్ దుస్తుల వ్యాపారం పేరుతో ఓ వాణిజ్య భవనంలో కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారు. వాస్తవానికి అక్కడ నకిలీ నోట్లను ముద్రించే పని జరిగింది. అనుమానం రావడంతో ఎస్ఓజీ బృందం కార్యాలయం, అక్కడ పని చేసే వ్యక్తులపై నిశితంగా నిఘా ఉంచింది. ముగ్గురు నిందితులు నకిలీ నోట్ల ముద్రణ కోసం కలుసుకున్నప్పుడు దాడి చేసి వారిని పట్టుకుంది. ఆ కార్యాలయంలో నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగించే పేపర్, కలర్ ప్రింటర్, ప్రింటింగ్ ఇంక్, ల్యామినేషన్ మిషన్ వంటి పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో