సీఎంలతో ప్రధాని మోడీ కీలక భేటీ.. మళ్లీ లాక్డౌన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతుండడంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ఓవైపు నివారణ చర్యలను పూనుకుంటూనే.. మరోవైపు.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుండగా.. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశానికి సిద్ధం అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగబోతోంది.. ఈ నెల 9వ తేదీన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం కోవివ్ పరిస్థితి, వ్యాక్సినేషన్, ఇతర అంశాలపై కీలకంగా చర్చించిన ప్రధాని మోడీ.. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని, కరోనాకు చెక్ పెట్టేందుకు టీకానే ఉత్తమ మార్గమని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఇవాళ జరిగే సీఎంలపై భేటీలో.. కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: ‘సురేంద్ర పురి’ కుందా సత్యనారాయణ కన్నుమూత
Also Read
కాగా, భారత్లో నిన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,94,720కు చేరింది.. మరో 442 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.. ఈ తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత పెరుగుతున్న కోవిడ్-19 కేసులపై ప్రధాని మోడీ సమావేశం కీలకంగా మారనుంది.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ మరియు గుజరాత్లో ఆందోళనకర స్థాయిలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు భారీగానే వెలుగుచూస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించడంతో.. రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనున్నారు.. కోవిడ్ కట్టడిపై మరింత కఠినంగా వ్యవహరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!