Elephants Died: జార్ఖండ్లో విషాదం.. 33000 వోల్టేజ్ వైర్ తగిలి 5 ఏనుగులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephants Died: జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని ముసబాని అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. 33000 హై ఓల్టేజీ విద్యుత్ వైరు తగిలి ఐదు ఏనుగులు మృతి చెందాయి. చనిపోయిన ఏనుగుల్లో రెండు పిల్లలు, మూడు పెద్ద ఏనుగులు ఉన్నాయి. ముసబాని అటవీ ప్రాంతంపైన పొటాస్ అడవి మధ్యలో తవ్విన గొయ్యి దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ఏనుగుల గుంపు కిందికి వెళుతుండగా ఒక్కసారిగా పైన వెళ్తున్న 33 వేల వోల్టుల వైరు తగిలింది. 5 ఏనుగులు మరణించిన హైటెన్షన్ వైర్ HCL గనులకు వెళుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్థరాత్రి నుంచి దాదాపు డజను ఏనుగుల గుంపు ఆ ప్రాంతమంతా సంచరిస్తోంది. సోమవారం అర్థరాత్రి హైటెన్షన్ వైర్లు తగిలి ఏనుగులు చనిపోయి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also:Andela Sriramulu Yadav: అందెల శ్రీరాములుకు మద్దతు తెలిపిన నిరుద్యోగ జేఏసీ.. మంత్రి సబితపై ఫైర్
Also Read
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాన్ని అటకెక్కిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అడవి నుంచి కలపను తెస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులను తరిమికొడుతుండగా.. చనిపోయిన ఏనుగులను గ్రామ ప్రజలు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముసబాని అటవీ ప్రాంతంలోని ఉపరబంధ అటవీ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగిన ప్రదేశంలో కేవలం 11 అడుగుల ఎత్తులో 33000 ఓల్టేజీ హైటెన్షన్ వైర్ వెళుతోంది. మరోవైపు రెండ్రోజుల క్రితం అటవీశాఖ అధికారులు అడవిలో కందకం తవ్వారు. లోపల నుంచి తీసిన మట్టిని కూడా అక్కడే ఉంచారు. ఏనుగుల గుంపు గుట్ట లాంటి మట్టిదిబ్బను దాటుతుండగా, హైటెన్షన్ వైరు తగిలి ఐదు ఏనుగులు చనిపోయాయి. చనిపోయిన ఐదు ఏనుగుల్లో రెండు ఆడ ఏనుగులు కూడా ఉన్నాయి.
Read Also:Harish Rao: చివరకు రామక్క పాటని కూడా కాంగ్రెస్, బీజేపీ కాపీ కొట్టింది: హరీష్ రావు
దాదాపు వారం రోజులుగా ముసబాని ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నా అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా పంటలను కాపాడుకునేందుకు ఏనుగుల గుంపును తరిమి కొట్టడంతో గ్రామ ప్రజలు అడవి వైపు పరుగులు తీశారు. ఈ సమయంలో అటవీశాఖ నిర్లక్ష్యం కారణంగా హైటెన్షన్ వైర్ తగిలి ఏనుగులు అకాల మృత్యువాత పడ్డాయని వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ ఆదేశించారు.
తాజావార్తలు
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!