PM Modi: మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ
- మూడు దేశాల పర్యటన
- ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ
- వివరాలు ఇలా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నైజీరియా, బ్రెజిల్, గయానాలలో తన ఐదు రోజుల మూడు దేశాల పర్యటన ముగిసింది. దింతో ఆయన గురువారం ఆయన గయానా నుండి బయలుదేరుతున్నట్లు ప్రకటిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ఒక పోస్ట్లో పేర్కొంది.
Also Read: Etela Rajender : మత్స్యకారులను రాజకీయంగా విస్మరిస్తున్నారు
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
- Amen : "గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు".. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
ప్రధాన మంత్రి ఆదివారం నైజీరియా చేరుకున్నారు. ఇది 17 సంవత్సరాలలో పశ్చిమ ఆఫ్రికా దేశానికి భారత ప్రధాని చేసిన మొదటి పర్యటన. అక్కడ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం భారతీయ సమాజంతో సంభాషించారు. అతని సందర్శన సమయంలో నైజీరియా జాతీయ అవార్డు, గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ (GCON)లు లభించాయి. ఈ ఘనతను అందుకున్న రెండవ విదేశీ ప్రముఖుడిగా మోడీ గుర్తింపు పొందాడు.
Also Read: Siddaramaiah: ఎగ్జిట్ పోల్స్పై నమ్మకం లేదు.. శనివారం ఫలితాలు వేరేగా ఉంటాయి
నైజీరియా నుండి, మోడీ G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు బ్రెజిల్కు వెళ్లారు. అక్కడ ఆయన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటిష్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్తో సహా ప్రపంచ నాయకులను కలిశారు. పలువురు ప్రపంచ నేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రధాని గయానాకు వెళ్లారు. 50 ఏళ్ల తర్వాత కరేబియన్ దేశానికి భారత దేశాధినేత తొలిసారిగా పర్యటించారు. కరేబియన్ భాగస్వామ్య దేశాల నాయకులు హాజరైన 2వ ఇండియా-కారికామ్ సమ్మిట్కు ఆయన సహ అధ్యక్షుడిగా ఉన్నారు. తన పర్యటన సందర్భంగా.. ప్రధాని మోడీకి గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ద్వారా దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కూడా లభించింది. గయానా పార్లమెంటు ప్రత్యేక సెషన్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ తరువాత రోజు జరిగిన ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో మాట్లాడారు.
తాజావార్తలు
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!