PM Modi – UAE President: యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికిన ప్రధాని మోడీ..
PM Modi – UAE President: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈరోజు (జనవరి 19) భారతదేశానికి అధికారిక పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ప్రధాన మంత్రి మోడీ యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. భారత్లో యూఏఈ అధ్యక్షుడి పర్యటన కేవలం రెండు గంటలకు పైగా మాత్రమే జరగనున్నట్లు సమాచారం.
READ ALSO: JioHotstar సబ్స్క్రిప్షన్ ప్లాన్లలో భారీ మార్పులు.. కొత్త ప్లాన్ రేట్స్ ఇదిగో..!
Also Read

యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షేక్ మొహమ్మద్ భారతదేశానికి అధికారికంగా రావడం ఇది మూడవసారి, మొత్తంగా ఆయనకు ఇది ఐదవ పర్యటన కానుంది. ఈ పర్యటన భారతదేశం- యూఏఈ సంబంధాలలో మరో మైలురాయిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై ఉమ్మడి ప్రయోజనాల కోసం ఈ ఇద్దరు నాయకులు కొత్త మార్గాన్ని రూపొందించనున్నారు. భారతదేశం – యూఏఈ మధ్య సంబంధం కేవలం వాణిజ్యానికే పరిమితం కాలేదు. ఇటీవలి సంవత్సరాలలోఈ రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సంబంధాలు పెరిగాయి. సెప్టెంబర్ 2024లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఏప్రిల్ 2025లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భారతదేశాన్ని సందర్శించడం ఈ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది. నేటి సందర్శన ఆ చొరవలో భాగం అని, ఇది రక్షణ, సాంకేతికత వంటి రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తు్న్నారు. ఈ పర్యటన ఇంధన భద్రత, ముఖ్యంగా దీర్ఘకాలిక చమురు సరఫరాలు, పునరుత్పాదక శక్తిలో కొత్త కోణాలను స్థాపించడంపై దృష్టి పెడుతుందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Nitin Nabin: జాతీయ స్థాయిలో బీజేపీకి కొత్త సారథి.. రేపే ప్రధాని సమక్షంలో పట్టాభిషేకం!
తాజావార్తలు
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!