International Yoga Day 2024: శ్రీనగర్లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ..
- శ్రీనగర్లో యోగా దినోత్సవ వేడుకలు
- పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ
- జూన్ 30న "మన్ కీ బాత్" కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం దాల్ సరస్సు సమీపంలో ఉన్న షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ మంగళవారం వెల్లడించారు. ఈసారి యోగా దినోత్సవం థీమ్, ‘స్వయం మరియు సమాజం కోసం యోగా’ అని జాదవ్ చెప్పారు. యోగా ద్వారా మనలోని అంతర్గత బలాన్ని ఎలా పెంచుకోవచ్చన్నదే ఈ ఇతివృత్తమని, దాని ద్వారా సమాజ శ్రేయస్సు కూడా సాధ్యమవుతుందని జాదవ్ పేర్కొన్నారు. అంతేకాకుండా.. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి దారితీస్తుందని మంత్రి తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో లక్షలాది మంది ఉత్సాహంగా పాల్గొనడం సమాజాలపై యోగా తీవ్ర ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
Nara Lokesh: “2019లో ఈవీఎంలు గొప్పగా పని చేస్తే గెలిచి, ఓడిపోయినప్పుడు నిందిస్తారా?”
Also Read
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
మరోవైపు.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ లేఖ రాశారని మంత్రి జాదవ్ తెలిపారు. యోగా దినోత్సవ సందేశాన్ని గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ చేరవేయాలని, అందులో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాలని లేఖలో తెలిపారన్నారు. ఈ సందర్భంగా.. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో యోగా ఆధారంగా ఒక పుస్తకాన్ని మంత్రి జాదవ్ విడుదల చేశారు. ఈ పుస్తకం పిల్లలు యోగా నేర్చుకోవడానికి, సాధన చేయడానికి సహాయపడుతుందని తెలిపారు. ప్రధాని మోడీ కృషి వల్లనే ఐక్యరాజ్యసమితి యోగా దినోత్సవ ప్రతిపాదనను ఆమోదించిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. అంతేకాకుండా.. ఈ సంవత్సరం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘యోగా ఫర్ స్పేస్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాధారణ యోగా ప్రోటోకాల్ మార్గదర్శకాల ప్రకారం ఇస్రోలోని శాస్త్రవేత్తలు,అధికారులందరూ కలిసి యోగా చేస్తారు.
Sapthami Gowda: స్టార్ హీరో ఫ్యామిలీలో విడాకుల చిచ్చు.. పరువు నష్టం దావా వేసిన కాంతార నటి
ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు. జూన్ 30న.. ఆల్ ఇండియా రేడియోలో తన నెలవారీ కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో మరోసారి తన ఆలోచనలను దేశప్రజలతో పంచుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోడీ మంగళవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు. ‘ఎన్నికల కారణంగా కొన్ని నెలల విరామం తర్వాత మరోసారి ‘మన్ కీ బాత్’ వస్తోందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ నెల కార్యక్రమం జూన్ 30న జరగనుంది. మీరందరూ ఈ ప్రోగ్రామ్ కోసం మీ అభిప్రాయాలను ‘MyGov ఓపెన్ ఫోరమ్’ లేదా ‘NaMo యాప్’లో పంచుకోవచ్చు. మీరు మీ సందేశాన్ని 1800 117800లో రికార్డ్ చేయవచ్చు”. అని తెలిపారు.
తాజావార్తలు
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!