International Yoga Day 2024: శ్రీనగర్లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ..
- శ్రీనగర్లో యోగా దినోత్సవ వేడుకలు
- పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ
- జూన్ 30న "మన్ కీ బాత్" కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం దాల్ సరస్సు సమీపంలో ఉన్న షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ మంగళవారం వెల్లడించారు. ఈసారి యోగా దినోత్సవం థీమ్, ‘స్వయం మరియు సమాజం కోసం యోగా’ అని జాదవ్ చెప్పారు. యోగా ద్వారా మనలోని అంతర్గత బలాన్ని ఎలా పెంచుకోవచ్చన్నదే ఈ ఇతివృత్తమని, దాని ద్వారా సమాజ శ్రేయస్సు కూడా సాధ్యమవుతుందని జాదవ్ పేర్కొన్నారు. అంతేకాకుండా.. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి దారితీస్తుందని మంత్రి తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో లక్షలాది మంది ఉత్సాహంగా పాల్గొనడం సమాజాలపై యోగా తీవ్ర ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
Nara Lokesh: “2019లో ఈవీఎంలు గొప్పగా పని చేస్తే గెలిచి, ఓడిపోయినప్పుడు నిందిస్తారా?”
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
మరోవైపు.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ లేఖ రాశారని మంత్రి జాదవ్ తెలిపారు. యోగా దినోత్సవ సందేశాన్ని గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ చేరవేయాలని, అందులో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాలని లేఖలో తెలిపారన్నారు. ఈ సందర్భంగా.. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో యోగా ఆధారంగా ఒక పుస్తకాన్ని మంత్రి జాదవ్ విడుదల చేశారు. ఈ పుస్తకం పిల్లలు యోగా నేర్చుకోవడానికి, సాధన చేయడానికి సహాయపడుతుందని తెలిపారు. ప్రధాని మోడీ కృషి వల్లనే ఐక్యరాజ్యసమితి యోగా దినోత్సవ ప్రతిపాదనను ఆమోదించిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. అంతేకాకుండా.. ఈ సంవత్సరం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘యోగా ఫర్ స్పేస్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాధారణ యోగా ప్రోటోకాల్ మార్గదర్శకాల ప్రకారం ఇస్రోలోని శాస్త్రవేత్తలు,అధికారులందరూ కలిసి యోగా చేస్తారు.
Sapthami Gowda: స్టార్ హీరో ఫ్యామిలీలో విడాకుల చిచ్చు.. పరువు నష్టం దావా వేసిన కాంతార నటి
ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు. జూన్ 30న.. ఆల్ ఇండియా రేడియోలో తన నెలవారీ కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో మరోసారి తన ఆలోచనలను దేశప్రజలతో పంచుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోడీ మంగళవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు. ‘ఎన్నికల కారణంగా కొన్ని నెలల విరామం తర్వాత మరోసారి ‘మన్ కీ బాత్’ వస్తోందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ నెల కార్యక్రమం జూన్ 30న జరగనుంది. మీరందరూ ఈ ప్రోగ్రామ్ కోసం మీ అభిప్రాయాలను ‘MyGov ఓపెన్ ఫోరమ్’ లేదా ‘NaMo యాప్’లో పంచుకోవచ్చు. మీరు మీ సందేశాన్ని 1800 117800లో రికార్డ్ చేయవచ్చు”. అని తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!