PM Modi : ఉక్రెయిన్ పర్యటనలో మోడీ.. స్పెషల్ వీడియో విడుదల
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉక్రెయిన్లో తన చారిత్రాత్మక పర్యటన తర్వాత వీడియోను పంచుకున్నారు. అంతేకాకుండా, ఆ వీడియోలో తన పర్యటన అత్యంత ప్రత్యేకమైనదిగా వివరించాడు. ఉక్రెయిన్ను ఒక ముఖ్యమైన స్నేహితుడు అని కూడా పేర్కొన్నాడు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడంలో వ్యక్తిగతంగా సహకరిస్తానని హామీ ఇచ్చారని తెలుస్తోంది.
కాగా, నా ఉక్రెయిన్ పర్యటన చారిత్రాత్మకమని ప్రధాని మోడీ ఎక్స్లో రాశారు. ‘భారత్-ఉక్రెయిన్ మధ్య స్నేహాన్ని మరింతగా పెంచుకోవాలనే లక్ష్యంతో నేను ఈ దేశానికి వచ్చాను. నేను అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యాను. ఎల్లప్పుడూ శాంతి నెలకొనాలని భారత్ దృఢంగా విశ్వసిస్తోంది. ఉక్రెయిన్ ప్రభుత్వం, ప్రజలు వారి ఆతిథ్యానికి ధన్యవాదాలు.’ అని పేర్కొన్నారు.
Also Read
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
Read Also:Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Highlights from a very special visit to Ukraine, a valued friend of India’s. pic.twitter.com/0LuQ6vm5Iw
— Narendra Modi (@narendramodi) August 23, 2024
అంతకుముందు, ప్రధాని మోడీ ఇక్కడ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం కనుగొనడానికి ఒకరితో ఒకరు చర్చలు జరపవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. శాంతి స్థాపన కోసం చేసే ప్రతి ప్రయత్నాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఫిబ్రవరి 24, 2022న రష్యా ఉక్రెయిన్పై దాడి చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది. భారతదేశం, రష్యా చాలా కాలంగా స్నేహపూర్వక దేశాలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనకు భిన్నమైన అర్థాలు అన్వేషిస్తున్నారు. ప్రత్యేక రైలులో ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం కీవ్ చేరుకున్నారు.
ప్రధానమంత్రి కీవ్ పర్యటనను దౌత్యపరమైన సమతుల్యతగా అనేక వర్గాల్లో చూస్తున్నారు. ఎందుకంటే ఆయన రష్యా పర్యటన పాశ్చాత్య దేశాలలో ఆగ్రహాన్ని సృష్టించింది. కీవ్ పర్యటనకు దాదాపు ఆరు వారాల ముందు, ప్రధాని మోడీ రష్యాను సందర్శించారు. అందులో కాల్పుల విరమణ అంశంపై అధ్యక్షుడు పుతిన్తో లోతైన చర్చలు జరిపారు. కీవ్ పర్యటనకు ముందు, జూన్లో ఇటలీలోని అపులియాలో జరిగిన జి-7 శిఖరాగ్ర సమావేశంలో మోడీ జెలెన్స్కీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ అన్ని విధాలా కృషి చేస్తుందని మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడికి చెప్పారు. చర్చలు, దౌత్యం ద్వారానే శాంతి నెలకొంటుందని చెప్పారు.
Read Also:అత్యధికంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిన టాప్-10 దేశాలు
తాజావార్తలు
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
-
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!