PM Modi Kurnool Tour: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనలో భద్రత లోపం.. ఆలస్యంగా వెలుగులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Kurnool Tour: ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనలో భద్రత లోపం వెలుగు చూసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుండిపెంట హెలిపాడ్లో ప్రధానికి వీడ్కోలు సమయంలో పాస్ల జాబితాలో లేని వ్యక్తుల ప్రవేశం కలకలం సృష్టించింది. ఇతరుల పేరుతో ఉన్న పాసులతో ప్రధాని వలయంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. బీజేపీ నేతలు విశ్వరూపాచారి, తూముకుంట శివారెడ్డి పేర్లతో పాసులతో ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. పాసులు ఉన్నవారు కాకుండ వెంకటేశ్వర్లు, బాలముని అనే వ్యక్తులు వెళ్లారని గుర్తించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అసలు ఉన్న వారికి తెలియకుండా పాసులు దక్కించుకొని ట్యాంపరింగ్ చేశారనే అనుమానాలు ఉన్నాయి. వీఐపీల కోటాలో పాసులు లేని వారు కాకుండా వేరే వాళ్ళు వెళ్లడం కలకలం సృష్టిస్తోంది. ప్రమాదకర వ్యక్తులు ఇలాగే వెళ్లి ఉంటే పరిస్థితి ఏంటి..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భద్రత చర్యలు తీసుకునే ప్రధాని పర్యటనలో భద్రత లోపాలపై ఇప్పటికే బీజేపీ పెద్దలు, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం..
READ MORE: Danger: ఫోన్ 100% చార్జింగ్ పెడుతున్నారా.. అయితే బీకేర్ ఫుల్…
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!