PM Modi : ఆస్ట్రియాలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం.. వియన్నాలో మార్మోగిన వందేమాతరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi : రష్యా తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రియా చేరుకున్నారు. రాజధాని వియన్నాలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. నిజానికి 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించారు. గతంలో 1983లో ఇందిరా గాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. వియన్నా విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అనంతరం మోడీ హోటల్ రిట్జ్ కార్ల్టన్ చేరుకున్నారు. హోటల్కు చేరుకున్న తర్వాత ప్రధాని భారతీయ ప్రజలను కలుసుకున్నారు. హోటల్లో ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు వందేమాతరం ట్యూన్ వినిపించారు. ఈ ట్యూన్ తో వియన్నా ప్రతిధ్వనించింది. అనంతరం ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహ్మర్తో విందులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వచ్చారు. విందు సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెతో కూడా ప్రధాని మోడీ భేటీ కానున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీకి వియన్నాకు స్వాగతం అంటూ ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ ట్వీట్ చేశారు. ‘మిమ్మల్ని ఆస్ట్రియాకు స్వాగతించడం మా గౌరవం. ఆస్ట్రియా, భారత్ భాగస్వాములు. మీ పర్యటనలో మా రాజకీయ, ఆర్థిక చర్చల కోసం నేను ఎదురు చూస్తున్నాను.‘ అంటూ రాసుకొచ్చారు.
Also Read
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Read Also:Yoga Mistakes : యోగా చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేయకండి..
పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం
ప్రధాని మోడీ నేడు ఆస్ట్రియాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వియన్నాలో పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఆస్ట్రియాలో నివసిస్తున్న భారతీయులతో కూడా ఆయన సంభాషించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ఆస్ట్రేలియా ప్రతినిధులతో, 3 గంటలకు సీఈవోతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ ఆస్ట్రియా ఛాన్సలర్తో కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు రాష్ట్రపతిని కలుస్తారు. ప్రధాని మోడీ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇండియా-ఆస్ట్రియా స్టార్టప్ బ్రిడ్జ్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది.
రష్యా అత్యున్నత పురస్కారం అందుకున్న మోడీ
మాస్కోలో రష్యా అత్యున్నత గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’తో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించారు. ప్రధాని మోడీని అధ్యక్షుడు పుతిన్ సన్మానించారు. 2019లో ప్రధాని మోడీ రష్యా పర్యటన సందర్భంగా మాస్కో ఈ గౌరవాన్ని ప్రకటించింది. రష్యాలో, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ఉత్తమ పనితీరు కనబరిచిన పౌరులు లేదా సైనిక సిబ్బందికి ప్రదానం చేస్తారు. ప్రధాని మోడీ రష్యా అత్యున్నత గౌరవాన్ని అందుకోవడం భారత్, రష్యాల మధ్య ఉన్న లోతైన స్నేహానికి ప్రతీక. రష్యా అత్యున్నత గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడు, నాల్గవ రష్యాయేతర వ్యక్తి ప్రధాని మోడీ. ప్రధాని మోడీతో పాటు అజర్బైజాన్ అధినేత హేదర్ అలియేవ్, కజకిస్థాన్ తొలి అధ్యక్షుడు సుల్తాన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్లకు ఈ గౌరవం లభించింది.
Read Also:Gautam Gambhir Salary: గౌతమ్ గంభీర్ జీతం ఎంతో తెలుసా?
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!