Flax Seeds Powder: మహిళలకు వరం ఈ హోమ్ మేడ్ పొడి! రోజూ ఒక ముద్ద తింటే చాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flax Seeds Powder: ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా వ్యాధులను దూరం చేసుకోవాలనుకునే వారి కోసం, సహజ పద్ధతుల్లో బరువు తగ్గాలని చూసే వారి కోసం అవిస గింజల కారప్పొడి ఒక అద్భుతమైన వరం. ప్రస్తుతం మన జీవనశైలిలో పోషకాహార లోపం, పెరుగుతున్న బరువు పెద్ద సమస్యలుగా మారాయి. వీటన్నింటికీ ఇంటి చిట్కాలతోనే చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Rajnikanth : ‘తలైవర్ 173 నుండి డైరెక్టర్ ఔట్.. రేసులోకి క్రేజీ డైరెక్టర్
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
అవిస గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, శరీరంలోని మెటబాలిజంను వేగవంతం చేసి కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మన వంటింట్లో ఉండే దినుసులతో ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో, దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఈ స్పెషల్ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
అవిస గింజలు (1 కప్పు)
నువ్వులు (అర కప్పు)
ధనియాలు (పావు కప్పు), కరివేపాకు (గుప్పెడు)
ఎండుమిర్చి (20-25), పప్పులు (శెనగ, మినప – తలో 2 టేబుల్ స్పూన్లు)
జీలకర్ర, మెంతులు, చింతపండు, వెల్లుల్లి (15 రెబ్బలు), ఇంగువ, ఉప్పు.
తయారీ విధానం..
అవిస గింజలను పాన్లో వేసి చిటపటలాడే వరకు చిన్న మంటపై నిదానంగా వేయించాలి. తర్వాత నువ్వులు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చిని విడివిడిగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం శెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, చింతపండును కూడా వేయించాలి. దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఉప్పు, ఇంగువ కలిపి పొడి చేయాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి పల్స్ చేస్తే అవిస గింజల పొడి రెడీ అవుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
అవిస గింజల కారప్పొడిని కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఇది ఒక సూపర్ ఫుడ్ కూడా. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవిస గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచి, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూస్తాయి. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. దీనిలో ఉండే పీచు పదార్థం, ప్రోటీన్ వల్ల ఈ పొడి తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది అనవసరమైన ఆకలిని తగ్గించి, శరీరంలోని మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. ఫలితంగా ఒంట్లోని కొవ్వు వెన్నలా కరుగుతుంది.
అవిస గింజలతో పాటు ఇందులో వేసే నువ్వులలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ పొడిని ప్రతిరోజూ నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది గొప్ప ఔషధంలా పని చేస్తుంది. మహిళల్లో వచ్చే పీరియడ్స్ సమస్యలు, పీసీఓడీ (PCOD), మెనోపాజ్ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గించడంలో అవిస గింజల్లో ఉండే లిగ్నాన్స్ (Lignans) కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపడి, తిన్న ఆహారం త్వరగా వంటబట్టేలా చేస్తుంది.
చిన్న పిల్లలకు ఈ పొడిని తినిపించడం వల్ల వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. పెద్దవారిలో వయసు రీత్యా వచ్చే మతిమరుపు వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ముడతలు పడకుండా కాపాడి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అలాగే జుట్టు రాలడం తగ్గి, జుట్టు దృఢంగా, మెరుస్తూ పెరుగుతుంది.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!